Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:47 PM

సాగర్ శెట్కార్ గెలుపు కోసం కాంగ్రెస్ శ్రేణుల విస్తృత ప్రచారం

సాగర్ శెట్కార్ గెలుపు కోసం కాంగ్రెస్ శ్రేణుల విస్తృత ప్రచారం

సాగర్ శెట్కార్ గెలుపు కోసం కాంగ్రెస్ శ్రేణుల విస్తృత ప్రచారం
February 06, 2026 01:25 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీ 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగర్ శెట్కార్ గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ శెట్కార్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ శెట్కార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల జీవన స్థాయిని మెరుగుపరిచేందుకు చేసిన కృషిని ప్రజలకు వివరించారు. వార్డులో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. ప్రజల సమస్యలు వినడమే కాకుండా వాటికి పరిష్కారం చూపే పార్టీ కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టంగా చెప్పారు.ప్రజల నమ్మకాన్ని బలంగా నిలుపుకుంటూ, ప్రతి ఇంటికి చేరువై సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని అభ్యర్థి సాగర్ శెట్కార్ తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు సాయిలు పటేల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News