Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 12:58 AM

సీపీఐ యాదాద్రి జిల్లా నాయకుడు బోడ సుదర్శన్ ఆకస్మిక మృతి

సీపీఐ యాదాద్రి జిల్లా నాయకుడు బోడ సుదర్శన్ ఆకస్మిక మృతి

సీపీఐ యాదాద్రి జిల్లా నాయకుడు బోడ సుదర్శన్ ఆకస్మిక మృతి
December 23, 2025 02:40 AM 100 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

సీపీఐ యాదాద్రి జిల్లా నాయకుడు బోడ సుదర్శన్ ఆకస్మిక మృతి

సీపీఐ యాదాద్రి జిల్లా నాయకుడు బోడ సుదర్శన్ గుండెపోటుతో మృతి

స్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఐ నాయకుడు, వేములకొండ–వెంకటాపురం ప్రాంతాలకు చెందిన కామ్రేడ్ బోడ సుదర్శన్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతితో కమ్యూనిస్టు శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, అనుచరుల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.

పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన బోడ సుదర్శన్ ప్రజాసమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండేవారు. కార్మికులు, రైతుల హక్కుల కోసం సాగిన ఉద్యమాల్లో కీలకంగా పనిచేశారు. ఆయన సేవలు సీపీఐకు, ప్రజా ఉద్యమాలకు చిరస్మరణీయమని పార్టీ నేతలు కొనియాడారు.

కామ్రేడ్ బోడ సుదర్శన్ మృతికి సీపీఐ నాయకులు, కార్యకర్తలు జోహార్లు అర్పిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News