Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 02:58 AM

సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలి

సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలి

సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలి
January 08, 2026 04:40 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాలలో బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ

చిట్యాల స్థానికం ప్రతినిది ప్రశాంత్

ఖమ్మంలో జనవరి 18న నిర్వహించనున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభను లక్షలాది మంది పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ లొడంగి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా చిట్యాల పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో సీపీఐ మండల శాఖ ఆధ్వర్యంలో బహిరంగ సభ వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) భారతదేశ స్వాతంత్ర్యానికి ముందే ఆవిర్భవించి, దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని మొదటగా గర్జించిన ఏకైక పార్టీ సీపీఐ అని అన్నారు. 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సీపీఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 2024 డిసెంబర్ 26న శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, వాటి ముగింపుగా జనవరి 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచంలోని 40 దేశాల ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు.తెలంగాణ ప్రాంతంలో సీపీఐ నేతృత్వంలో సాగిన సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తికై నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటం చరిత్రత్మకమైన ఉద్యమమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ చిట్యాల మండల కార్యదర్శి ఎండి. అక్బర్, సహాయ కార్యదర్శి జిల్లా సత్యం, చిట్యాల పట్టణ కార్యదర్శి ఎస్.కె. షరీఫ్, సీనియర్ నాయకులు దేశగాని బాలరాజు, గుండాల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News