Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:56 AM

సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలి

సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలి

సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలి
08-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాలలో బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ

చిట్యాల స్థానికం ప్రతినిది ప్రశాంత్

ఖమ్మంలో జనవరి 18న నిర్వహించనున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభను లక్షలాది మంది పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ లొడంగి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా చిట్యాల పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో సీపీఐ మండల శాఖ ఆధ్వర్యంలో బహిరంగ సభ వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) భారతదేశ స్వాతంత్ర్యానికి ముందే ఆవిర్భవించి, దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని మొదటగా గర్జించిన ఏకైక పార్టీ సీపీఐ అని అన్నారు. 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సీపీఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 2024 డిసెంబర్ 26న శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, వాటి ముగింపుగా జనవరి 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచంలోని 40 దేశాల ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు.తెలంగాణ ప్రాంతంలో సీపీఐ నేతృత్వంలో సాగిన సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తికై నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటం చరిత్రత్మకమైన ఉద్యమమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ చిట్యాల మండల కార్యదర్శి ఎండి. అక్బర్, సహాయ కార్యదర్శి జిల్లా సత్యం, చిట్యాల పట్టణ కార్యదర్శి ఎస్.కె. షరీఫ్, సీనియర్ నాయకులు దేశగాని బాలరాజు, గుండాల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలి

Article Image

చిట్యాలలో బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ

చిట్యాల స్థానికం ప్రతినిది ప్రశాంత్

ఖమ్మంలో జనవరి 18న నిర్వహించనున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభను లక్షలాది మంది పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ లొడంగి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా చిట్యాల పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో సీపీఐ మండల శాఖ ఆధ్వర్యంలో బహిరంగ సభ వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) భారతదేశ స్వాతంత్ర్యానికి ముందే ఆవిర్భవించి, దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని మొదటగా గర్జించిన ఏకైక పార్టీ సీపీఐ అని అన్నారు. 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సీపీఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 2024 డిసెంబర్ 26న శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, వాటి ముగింపుగా జనవరి 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచంలోని 40 దేశాల ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు.తెలంగాణ ప్రాంతంలో సీపీఐ నేతృత్వంలో సాగిన సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తికై నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటం చరిత్రత్మకమైన ఉద్యమమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ చిట్యాల మండల కార్యదర్శి ఎండి. అక్బర్, సహాయ కార్యదర్శి జిల్లా సత్యం, చిట్యాల పట్టణ కార్యదర్శి ఎస్.కె. షరీఫ్, సీనియర్ నాయకులు దేశగాని బాలరాజు, గుండాల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News