Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:43 PM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన:మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన:మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన:మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
January 03, 2026 06:55 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ :నారాయణఖేడ్ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్)ద్వారా మంజూరైన చెక్కులను నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి అందజేశారు. పేద ప్రజలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కల్హేర్ మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన వడ్ల నవీతకు రూ.15,000, కంగ్టి మండలం ఎడ్ల రేగడి తాండకు చెందిన లక్ష్మీ బాయికి రూ.9,000, కంగ్టి మండలం చాప్ట్ (K) గ్రామానికి చెందిన లింగాయత్ శివనాథ్‌కు రూ.18,000, కంగ్టి మండలం రాసోల్ గ్రామానికి చెందిన పవన్ కుమార్‌కు రూ.25,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.‌ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్యం అనుకోని ఆర్థిక భారంగా మారుతుందని,అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రజలకు గొప్ప ఊరట కలిగిస్తుందని అన్నారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల మాజీ ప్రజా ప్రతినిధులు,గ్రామ సర్పంచులు,ఉపసర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News