సీఎం ఆర్ఎస్ లబ్ధిదారులకు సహాయ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
సీఎం ఆర్ఎస్ లబ్ధిదారులకు సహాయ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
Biksham
సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి లబ్ధిదారులకు వైద్య సహాయ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గం వ్యాప్తంగా ఇటీవల వివిధ రకాల ప్రమాదాలు, అనారోగ్య సమస్యలతో బాధపడి వైద్య సేవలు పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.
శనివారం రోజున మొత్తం 86 మంది లబ్ధిదారులకు సంబంధిత వైద్య సహాయ చెక్కులను జగదీష్ రెడ్డి అందజేశారు. ఆపద సమయంలో ప్రభుత్వం అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు. వైద్య ఖర్చుల భారం వల్ల ఏ కుటుంబం ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఈ సహాయం అందిస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రజా ప్రతినిధిగా ఎల్లప్పుడూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా తనవంతు ప్రయత్నం కొనసాగిస్తానని జగదీష్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సహాయ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు జగదీష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి