Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:59 PM

సీఎం ఆర్ఎస్ లబ్ధిదారులకు సహాయ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

సీఎం ఆర్ఎస్ లబ్ధిదారులకు సహాయ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

సీఎం ఆర్ఎస్ లబ్ధిదారులకు సహాయ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
03-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట :

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి లబ్ధిదారులకు వైద్య సహాయ చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గం వ్యాప్తంగా ఇటీవల వివిధ రకాల ప్రమాదాలు, అనారోగ్య సమస్యలతో బాధపడి వైద్య సేవలు పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.

శనివారం రోజున మొత్తం 86 మంది లబ్ధిదారులకు సంబంధిత వైద్య సహాయ చెక్కులను జగదీష్ రెడ్డి అందజేశారు. ఆపద సమయంలో ప్రభుత్వం అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు. వైద్య ఖర్చుల భారం వల్ల ఏ కుటుంబం ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఈ సహాయం అందిస్తున్నామని స్పష్టం చేశారు.

ప్రజా ప్రతినిధిగా ఎల్లప్పుడూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా తనవంతు ప్రయత్నం కొనసాగిస్తానని జగదీష్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సహాయ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు జగదీష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

సీఎం ఆర్ఎస్ లబ్ధిదారులకు సహాయ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

Article Image

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట :

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి లబ్ధిదారులకు వైద్య సహాయ చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గం వ్యాప్తంగా ఇటీవల వివిధ రకాల ప్రమాదాలు, అనారోగ్య సమస్యలతో బాధపడి వైద్య సేవలు పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.

శనివారం రోజున మొత్తం 86 మంది లబ్ధిదారులకు సంబంధిత వైద్య సహాయ చెక్కులను జగదీష్ రెడ్డి అందజేశారు. ఆపద సమయంలో ప్రభుత్వం అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు. వైద్య ఖర్చుల భారం వల్ల ఏ కుటుంబం ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఈ సహాయం అందిస్తున్నామని స్పష్టం చేశారు.

ప్రజా ప్రతినిధిగా ఎల్లప్పుడూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా తనవంతు ప్రయత్నం కొనసాగిస్తానని జగదీష్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సహాయ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు జగదీష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News