చిట్యాల స్థానికం ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్
నల్గొండ క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎం ఆర్ఎఫ్) పథకం కింద మంజూరైన చెక్లను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో 41 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.12,50,000 విలువైన చెక్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని అన్నారు. సీఎం ఆర్ఎఫ్ పథకం ఎంతో ఉపయోగకరమై, పేద ప్రజలకు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నదని పేర్కొన్నారు.
అర్హులైన వారందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్రెడ్డి సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి