Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 03:56 AM

సదాశివపేట మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఘణపురం చంద్రశేఖర్ ప్రకటన

సదాశివపేట మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఘణపురం చంద్రశేఖర్ ప్రకటన

సదాశివపేట మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఘణపురం చంద్రశేఖర్ ప్రకటన
08-02-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా

సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు సంబంధించి ఘణపురం చంద్రశేఖర్ కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన పరిచయాన్ని వెల్లడిస్తూ, గత పది సంవత్సరాలుగా అదే వార్డులో నివసిస్తూ ప్రజల సమస్యలను దగ్గర నుంచి తెలుసుకుంటూ సాధ్యమైనంత వరకు పరిష్కారానికి తోడ్పడుతూ వచ్చానని తెలిపారు.పార్టీ పదవి ఉన్నా లేకపోయినా తాగునీటి సమస్య, పరిశుభ్రత, రోడ్ల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో ప్రజల తరపున అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. అవకాశం లభిస్తే కౌన్సిలర్‌గా అధికారిక బాధ్యతలు స్వీకరించి వార్డు సమస్యలకు స్థిరమైన పరిష్కారాలు చూపించి 10వ వార్డును ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు.అలాగే వార్డులో నివసించే ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రత కల్పించే దిశగా ఘణపురం యశ్వంతరావు ఆరోగ్య సేవా సంస్థ ద్వారా గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించే ప్రతిపాదనను వెల్లడించారు. ప్రజాసేవే తన ప్రధాన ఆశయమని, పదవులకంటే ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తానని ఆయన పేర్కొన్నారు.

Sthanikam

సదాశివపేట మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఘణపురం చంద్రశేఖర్ ప్రకటన

Article Image

సంగారెడ్డి జిల్లా

సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు సంబంధించి ఘణపురం చంద్రశేఖర్ కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన పరిచయాన్ని వెల్లడిస్తూ, గత పది సంవత్సరాలుగా అదే వార్డులో నివసిస్తూ ప్రజల సమస్యలను దగ్గర నుంచి తెలుసుకుంటూ సాధ్యమైనంత వరకు పరిష్కారానికి తోడ్పడుతూ వచ్చానని తెలిపారు.పార్టీ పదవి ఉన్నా లేకపోయినా తాగునీటి సమస్య, పరిశుభ్రత, రోడ్ల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో ప్రజల తరపున అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. అవకాశం లభిస్తే కౌన్సిలర్‌గా అధికారిక బాధ్యతలు స్వీకరించి వార్డు సమస్యలకు స్థిరమైన పరిష్కారాలు చూపించి 10వ వార్డును ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు.అలాగే వార్డులో నివసించే ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రత కల్పించే దిశగా ఘణపురం యశ్వంతరావు ఆరోగ్య సేవా సంస్థ ద్వారా గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించే ప్రతిపాదనను వెల్లడించారు. ప్రజాసేవే తన ప్రధాన ఆశయమని, పదవులకంటే ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తానని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News