Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:34 PM

సచివాలయాలపై కూన రవికుమార్ తన సహజమైన నోటిదూలతో అభ్యంతరకర వ్యాఖ్యలు - ఆముదాలవలస అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చింతాడ రవికుమార్ ఘాటు హెచ్చర

సచివాలయాలపై కూన రవికుమార్ తన సహజమైన నోటిదూలతో అభ్యంతరకర వ్యాఖ్యలు - ఆముదాలవలస అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చింతాడ రవికుమార్ ఘాటు హెచ్చర

సచివాలయాలపై కూన రవికుమార్ తన సహజమైన నోటిదూలతో అభ్యంతరకర వ్యాఖ్యలు - ఆముదాలవలస అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చింతాడ రవికుమార్ ఘాటు హెచ్చర
January 30, 2026 07:59 AM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

అంతర్జాతీయ ప్రశంసలు పొందిన వ్యవస్థను దరిద్రాలయాలనడం కూన రవి అవివేకానికి నిదర్శనం. ​ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు సచివాలయ వ్యవస్థపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. గాంధీజీ కలలుగన్న 'గ్రామ స్వరాజ్యం' స్ఫూర్తితో, పరిపాలన వికేంద్రీకరణే ధ్యేయంగా ఏర్పడిన ఈ వ్యవస్థను అవమానించడం అంటే ప్రజలను అవమానించడమే.


​కూన రవికుమార్ ఈ వాస్తవాలు తెలుసుకోవాలి...

​ప్రపంచస్థాయిలో ఈ వ్యవస్థ పొందిన గుర్తింపునకు ఒక ఉదాహరణగా చూస్తే! సచివాలయ వ్యవస్థలో సాంకేతికతను వాడుతున్న తీరును మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ స్వయంగా ప్రశంసించారు. డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు.


​నీతి ఆయోగ్ నుండి ప్రశంసలను పొందింది. అవినీతిని అరికట్టడానికి, సేవల పంపిణీలో జాప్యం తగ్గించడానికి ఇది ఒక 'మంచి మోడల్' అని నీతి ఆయోగ్ తన నివేదికల్లో అభినందించింది.

​జాతీయ అవార్డులు: సుపరిపాలన (Good Governance) విభాగంలో ఈ వ్యవస్థకు పలుమార్లు జాతీయ స్థాయి స్కోచ్ (SKOCH) అవార్డులు లభించాయి.


మన సచివాలయ వ్యవస్థ ​ఇతర రాష్ట్రాలకు ఆదర్శం: 2022లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ గారు ఏపీ సచివాలయ నమూనాను పరిశీలించి, తమ రాష్ట్రంలోనూ ఇలాగే నిర్మిస్తామని ప్రకటించారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సలహాదారులు కూడా ఇక్కడి RBKలు, సచివాలయ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని కొనియాడారు.

​వ్యవస్థ వల్ల కలిగిన ప్రయోజనాలు ఇవే:

​ఇంటి వద్దకే సేవలు: గతంలో ప్రజలు సేవల కోసం మండలాలు, జిల్లాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సుమారు 540 పైగా ప్రభుత్వ సేవలను స్థానికంగానే పొందే వెసులుబాటు కలిగింది.

​నిర్దిష్ట కాలపరిమితి (SLA): ప్రతి సేవకూ ఒక కాలపరిమితిని నిర్ణయించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా పారదర్శకతను తీసుకువచ్చారు.

​భారీ ఉద్యోగ కల్పన: ఏకంగా 1.5 లక్షల మంది యువతకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించి వారిని పరిపాలనలో భాగస్వాములను చేశారు.


​విపత్తులో సేవలు: ప్రాణాలకు తెగించి COVID-19 వంటి విపత్కర పరిస్థితుల్లో సచివాలయ సిబ్బంది చేసిన సేవలను "దండగ" అనడం మీ బరితెగింపుకు పరాకాష్ట.


నేడు కూడా ప్రభుత్వం నెల నెలా ఇచ్చే పింఛన్లు ను సైతం ప్రజలకు పంపిణీ చేస్తుంది సచివాలయ సిబ్బంది.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సచివాలయ వ్యవస్థపై విషం చిమ్ముతూ, సిబ్బందిని దూషిస్తూ వారిని ఆందోళన పరచడం దారుణం. జగనన్న ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఈ వ్యవస్థపై మీకున్న అక్కసును సిబ్బందిపై చూపడం మానుకోవాలి. ప్రజలు, ఉద్యోగులు అన్నీ గమనిస్తున్నారు, సమయం వచ్చినప్పుడు మీకు తగిన బుద్ధి చెబుతారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News