PRINT TIME: April 11, 2026 01:54 PM
సచివాలయంలో ఉత్తమ్ను కలిసిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
సచివాలయంలో ఉత్తమ్ను కలిసిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
January 08, 2026 06:30 PM
157 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
ఈరోజు సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని
ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సాగునీరు, పౌర సరఫరాలకు సంబంధించిన సమస్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వారు చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అంశాలపై సానుకూల స్పందన లభించిందని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి