Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:32 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలలచే ప్రచారం చేయిస్తున్న అభ్యర్థి పై చర్యలు తీసుకోవాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలలచే ప్రచారం చేయిస్తున్న అభ్యర్థి పై చర్యలు తీసుకోవాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలలచే ప్రచారం చేయిస్తున్న అభ్యర్థి పై చర్యలు తీసుకోవాలి
December 13, 2025 06:41 PM 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

బాలల హక్కుల పరిరక్షణ వేదిక కొడారి వెంకటేష్

యాదాద్రి భువనగిరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలలచే ప్రచారం చేస్తూ, వారి హక్కులకు భంగం కలిగించే అభ్యర్థుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూట కొండూరు మండలం ఆరెగూడెం లో కాంగ్రెస్, సిపిఎం పార్టీలు బలపరిచిన అభ్యర్థి "పేరబోయిన దివ్య మకరజ్యోతి కార్తిక్" గ్రామ సర్పంచ్ గా బరిలో ఉండి (కత్తెర గుర్తు తో) ఓటర్లను ప్రభావితం చేయడానికి పిల్లలచే ప్రచారం చేయిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సంఘటన పై జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వెంటనే సమగ్ర విచారణ జరిపించి పిల్లలచే ప్రచారం చేయిస్తున్న అభ్యర్థి పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, జిల్లాలో ఎవరు కూడా పిల్లలతో ఎన్నికల్లో ప్రచారం చేసినా, బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News