Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:31 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలలచే ప్రచారం చేయిస్తున్న అభ్యర్థి పై చర్యలు తీసుకోవాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలలచే ప్రచారం చేయిస్తున్న అభ్యర్థి పై చర్యలు తీసుకోవాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలలచే ప్రచారం చేయిస్తున్న అభ్యర్థి పై చర్యలు తీసుకోవాలి
December 13, 2025 06:41 PM 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

బాలల హక్కుల పరిరక్షణ వేదిక కొడారి వెంకటేష్

యాదాద్రి భువనగిరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలలచే ప్రచారం చేస్తూ, వారి హక్కులకు భంగం కలిగించే అభ్యర్థుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూట కొండూరు మండలం ఆరెగూడెం లో కాంగ్రెస్, సిపిఎం పార్టీలు బలపరిచిన అభ్యర్థి "పేరబోయిన దివ్య మకరజ్యోతి కార్తిక్" గ్రామ సర్పంచ్ గా బరిలో ఉండి (కత్తెర గుర్తు తో) ఓటర్లను ప్రభావితం చేయడానికి పిల్లలచే ప్రచారం చేయిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సంఘటన పై జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వెంటనే సమగ్ర విచారణ జరిపించి పిల్లలచే ప్రచారం చేయిస్తున్న అభ్యర్థి పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, జిల్లాలో ఎవరు కూడా పిల్లలతో ఎన్నికల్లో ప్రచారం చేసినా, బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News