స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలలచే ప్రచారం చేయిస్తున్న అభ్యర్థి పై చర్యలు తీసుకోవాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలలచే ప్రచారం చేయిస్తున్న అభ్యర్థి పై చర్యలు తీసుకోవాలి
స్థానికం బృందం
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
బాలల హక్కుల పరిరక్షణ వేదిక కొడారి వెంకటేష్
యాదాద్రి భువనగిరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలలచే ప్రచారం చేస్తూ, వారి హక్కులకు భంగం కలిగించే అభ్యర్థుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూట కొండూరు మండలం ఆరెగూడెం లో కాంగ్రెస్, సిపిఎం పార్టీలు బలపరిచిన అభ్యర్థి "పేరబోయిన దివ్య మకరజ్యోతి కార్తిక్" గ్రామ సర్పంచ్ గా బరిలో ఉండి (కత్తెర గుర్తు తో) ఓటర్లను ప్రభావితం చేయడానికి పిల్లలచే ప్రచారం చేయిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సంఘటన పై జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వెంటనే సమగ్ర విచారణ జరిపించి పిల్లలచే ప్రచారం చేయిస్తున్న అభ్యర్థి పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, జిల్లాలో ఎవరు కూడా పిల్లలతో ఎన్నికల్లో ప్రచారం చేసినా, బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి