Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:31 PM

సాయి కుమార్ గౌడ్ గెలుపు సందర్భంగా మొక్కు చెల్లించిన మల్లేష్

సాయి కుమార్ గౌడ్ గెలుపు సందర్భంగా మొక్కు చెల్లించిన మల్లేష్

సాయి కుమార్ గౌడ్ గెలుపు సందర్భంగా మొక్కు చెల్లించిన మల్లేష్
December 16, 2025 05:28 PM 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో నూతన సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన కూనూరు సాయి కుమార్ గౌడ్, ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో సాయి కుమార్ గౌడ్ విజయం సాధించాలంటూ ముందుగానే మొక్కుకున్న గ్రామానికి చెందిన తెలుసూరి మల్లేష్, గెలుపు అనంతరం గ్రామ దేవత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వాముల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తన మొక్కును చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి కృషి చేసే నాయకుడిగా సాయి కుమార్ గౌడ్ విజయం గ్రామానికి శుభపరిణామమని పేర్కొన్నారు. నూతన సర్పంచ్ నాయకత్వంలో బోగారం గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News