Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:02 AM

సావిత్రిబాయి ఫూలే జయంతి, సైబర్ మోసాలపై అవగాహన

సావిత్రిబాయి ఫూలే జయంతి, సైబర్ మోసాలపై అవగాహన

సావిత్రిబాయి ఫూలే జయంతి, సైబర్ మోసాలపై అవగాహన
January 03, 2026 06:01 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హయత్‌నగర్, జనవరి 3 (స్థానిక ప్రతినిధి)

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్‌బాబు మాట్లాడుతూ సమాజంలో మహిళా విద్యకు బాటలు వేసిన సావిత్రిబాయి ఫూలే సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రొఫెసర్ నాగేంద్ర 1848లో భిదేవాడలో తొలి మహిళా పాఠశాల ప్రారంభించి అణగారిన వర్గాల బాలికలకు విద్య అందించిన త్యాగాన్ని గుర్తుచేశారు.

డా. గీతా నాయక్ విద్య ద్వారానే సమానత్వం సాధ్యమని, మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. మహిళా సాధికారత సెల్ కోఆర్డినేటర్ డా. అపర్ణ చతుర్వేది మహిళా విద్య కోసం సావిత్రిబాయి ఎదుర్కొన్న అడ్డంకులు, పోరాటాలను వివరించారు. ఈ సందర్భంగా అర్షియా (బీకాం–సీఏ) సావిత్రిబాయి ఫూలే వేషధారణలో సందేశం ఇచ్చింది.

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ సహకారంతో ‘ఫ్రాడ్‌కు ఫుల్‌స్టాప్’ కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌హెచ్‌వో నాగరాజు గౌడ్, ఎస్‌ఐ సంతోష్‌కుమార్ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, మోసాలు జరిగిన వెంటనే 1930కు ఫోన్ చేయాలని, సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

అలాగే కళాశాల గ్రంథాలయానికి సంస్కృత గెస్ట్ లెక్చరర్ సుభాషిణి రూ.6 వేల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, ఐసీసీ కన్వీనర్ డా. అనిత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News