Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:51 AM

సావిత్రిబాయి ఫూలే జయంతి, సైబర్ మోసాలపై అవగాహన

సావిత్రిబాయి ఫూలే జయంతి, సైబర్ మోసాలపై అవగాహన

సావిత్రిబాయి ఫూలే జయంతి, సైబర్ మోసాలపై అవగాహన
January 03, 2026 06:01 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హయత్‌నగర్, జనవరి 3 (స్థానిక ప్రతినిధి)

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్‌బాబు మాట్లాడుతూ సమాజంలో మహిళా విద్యకు బాటలు వేసిన సావిత్రిబాయి ఫూలే సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రొఫెసర్ నాగేంద్ర 1848లో భిదేవాడలో తొలి మహిళా పాఠశాల ప్రారంభించి అణగారిన వర్గాల బాలికలకు విద్య అందించిన త్యాగాన్ని గుర్తుచేశారు.

డా. గీతా నాయక్ విద్య ద్వారానే సమానత్వం సాధ్యమని, మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. మహిళా సాధికారత సెల్ కోఆర్డినేటర్ డా. అపర్ణ చతుర్వేది మహిళా విద్య కోసం సావిత్రిబాయి ఎదుర్కొన్న అడ్డంకులు, పోరాటాలను వివరించారు. ఈ సందర్భంగా అర్షియా (బీకాం–సీఏ) సావిత్రిబాయి ఫూలే వేషధారణలో సందేశం ఇచ్చింది.

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ సహకారంతో ‘ఫ్రాడ్‌కు ఫుల్‌స్టాప్’ కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌హెచ్‌వో నాగరాజు గౌడ్, ఎస్‌ఐ సంతోష్‌కుమార్ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, మోసాలు జరిగిన వెంటనే 1930కు ఫోన్ చేయాలని, సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

అలాగే కళాశాల గ్రంథాలయానికి సంస్కృత గెస్ట్ లెక్చరర్ సుభాషిణి రూ.6 వేల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, ఐసీసీ కన్వీనర్ డా. అనిత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News