సావిత్రిబాయి ఫూలే జయంతి, సైబర్ మోసాలపై అవగాహన
సావిత్రిబాయి ఫూలే జయంతి, సైబర్ మోసాలపై అవగాహన
Editor Desk
హయత్నగర్, జనవరి 3 (స్థానిక ప్రతినిధి)
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్నగర్లో మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్బాబు మాట్లాడుతూ సమాజంలో మహిళా విద్యకు బాటలు వేసిన సావిత్రిబాయి ఫూలే సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రొఫెసర్ నాగేంద్ర 1848లో భిదేవాడలో తొలి మహిళా పాఠశాల ప్రారంభించి అణగారిన వర్గాల బాలికలకు విద్య అందించిన త్యాగాన్ని గుర్తుచేశారు.
డా. గీతా నాయక్ విద్య ద్వారానే సమానత్వం సాధ్యమని, మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. మహిళా సాధికారత సెల్ కోఆర్డినేటర్ డా. అపర్ణ చతుర్వేది మహిళా విద్య కోసం సావిత్రిబాయి ఎదుర్కొన్న అడ్డంకులు, పోరాటాలను వివరించారు. ఈ సందర్భంగా అర్షియా (బీకాం–సీఏ) సావిత్రిబాయి ఫూలే వేషధారణలో సందేశం ఇచ్చింది.
హయత్నగర్ పోలీస్ స్టేషన్ సహకారంతో ‘ఫ్రాడ్కు ఫుల్స్టాప్’ కార్యక్రమం నిర్వహించారు. ఎస్హెచ్వో నాగరాజు గౌడ్, ఎస్ఐ సంతోష్కుమార్ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, మోసాలు జరిగిన వెంటనే 1930కు ఫోన్ చేయాలని, సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
అలాగే కళాశాల గ్రంథాలయానికి సంస్కృత గెస్ట్ లెక్చరర్ సుభాషిణి రూ.6 వేల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, ఐసీసీ కన్వీనర్ డా. అనిత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి