Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:54 AM

సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్

సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్

సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్
January 03, 2026 02:37 PM 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నేటి తరానికి వెలుగునిచ్చిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే

రామన్నపేట స్థానికం ప్రతినిధి

దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన సావిత్రిబాయి పూలే నేటి తరానికి వెలుగునిచ్చిన మహానీయురాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్ పేర్కొన్నారు. మండలంలోని పల్లివాడ గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, మహిళలకు చదువు నేరంగా భావించిన కాలంలో ధైర్యంగా విద్యను ఆయుధంగా చేసుకొని సమాజ మార్పుకు పూనుకున్న విప్లవాత్మక వ్యక్తిత్వం సావిత్రిబాయి పూలేనని అన్నారు. ఆమె చూపిన పోరాట స్ఫూర్తిని నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు.

అంతకుముందు కామినేని ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును సర్పంచ్ ప్రారంభించారు. ఈ శిబిరంలో కామినేని ఆసుపత్రి నుంచి వచ్చిన కంటి వైద్యులు, ఎముకల వైద్యులు, జనరల్ వైద్య నిపుణులు పాల్గొని బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ అవసరమైన రోగులను సోమవారం కామినేని ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు, ఉపసర్పంచ్ పావిరాల మత్స్యగిరి, వార్డు సభ్యులు కంబాలపల్లి మధు, గట్టు ఉపేందర్, కర్రే లావణ్య, జనపాల కవిత, నరసింహ, కర్రే శ్రీనివాస్, బెలిజ నరసింహ, కంకణాల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News