Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:09 AM

సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్

సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్

సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్
January 03, 2026 02:37 PM 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నేటి తరానికి వెలుగునిచ్చిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే

రామన్నపేట స్థానికం ప్రతినిధి

దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన సావిత్రిబాయి పూలే నేటి తరానికి వెలుగునిచ్చిన మహానీయురాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్ పేర్కొన్నారు. మండలంలోని పల్లివాడ గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, మహిళలకు చదువు నేరంగా భావించిన కాలంలో ధైర్యంగా విద్యను ఆయుధంగా చేసుకొని సమాజ మార్పుకు పూనుకున్న విప్లవాత్మక వ్యక్తిత్వం సావిత్రిబాయి పూలేనని అన్నారు. ఆమె చూపిన పోరాట స్ఫూర్తిని నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు.

అంతకుముందు కామినేని ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును సర్పంచ్ ప్రారంభించారు. ఈ శిబిరంలో కామినేని ఆసుపత్రి నుంచి వచ్చిన కంటి వైద్యులు, ఎముకల వైద్యులు, జనరల్ వైద్య నిపుణులు పాల్గొని బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ అవసరమైన రోగులను సోమవారం కామినేని ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు, ఉపసర్పంచ్ పావిరాల మత్స్యగిరి, వార్డు సభ్యులు కంబాలపల్లి మధు, గట్టు ఉపేందర్, కర్రే లావణ్య, జనపాల కవిత, నరసింహ, కర్రే శ్రీనివాస్, బెలిజ నరసింహ, కంకణాల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News