సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్
సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్
Editor Desk
నేటి తరానికి వెలుగునిచ్చిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే
రామన్నపేట స్థానికం ప్రతినిధి
దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన సావిత్రిబాయి పూలే నేటి తరానికి వెలుగునిచ్చిన మహానీయురాలని గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు గౌడ్ పేర్కొన్నారు. మండలంలోని పల్లివాడ గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ ఆవరణలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, మహిళలకు చదువు నేరంగా భావించిన కాలంలో ధైర్యంగా విద్యను ఆయుధంగా చేసుకొని సమాజ మార్పుకు పూనుకున్న విప్లవాత్మక వ్యక్తిత్వం సావిత్రిబాయి పూలేనని అన్నారు. ఆమె చూపిన పోరాట స్ఫూర్తిని నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు.
అంతకుముందు కామినేని ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును సర్పంచ్ ప్రారంభించారు. ఈ శిబిరంలో కామినేని ఆసుపత్రి నుంచి వచ్చిన కంటి వైద్యులు, ఎముకల వైద్యులు, జనరల్ వైద్య నిపుణులు పాల్గొని బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ అవసరమైన రోగులను సోమవారం కామినేని ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు, ఉపసర్పంచ్ పావిరాల మత్స్యగిరి, వార్డు సభ్యులు కంబాలపల్లి మధు, గట్టు ఉపేందర్, కర్రే లావణ్య, జనపాల కవిత, నరసింహ, కర్రే శ్రీనివాస్, బెలిజ నరసింహ, కంకణాల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి