Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 09:44 PM

రుద్రవెల్లి మూసీ బ్రిడ్జికి రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలి

రుద్రవెల్లి మూసీ బ్రిడ్జికి రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలి

రుద్రవెల్లి మూసీ బ్రిడ్జికి రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలి
March 16, 2026 08:18 PM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి

దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రుద్రవెల్లి మూసీ బ్రిడ్జికి జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం రోజున బీబీనగర్ తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ భగత్ కు సిపిఎం నాయకులు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ...గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టి అర్ధాంతరంగా వదిలేసిన మూసీ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయుటకు అధికారంలోకి వచ్చి మూడవ బడ్జెట్ ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావలసిన నిధులు కేటాయించాలని అన్నారు.హైదరాబాద్ లో తేలికపాటి వర్షాలు పడితే చాలు బీబీనగర్ నుండి పోచంపల్లికి వెళ్లేందుకు రాకపోకలు బంద్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి బంద్ కావడంతో చుట్టూ తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తుందని అన్నారు. ప్రజల రవాణా సౌకర్యార్థం కోసం తక్షణమే బడ్జెట్ లో నిధులు కేటాయించి మూసీ బ్రిడ్జి పనులను పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల అవస్థలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.స్థానిక ఎమ్మెల్యే,ఎంపీలు బాధ్యత వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు కేటాయింపచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బండారు శ్రవణ్ కుమార్ నాయకులు లోకదాసు పవన్,కుమ్మరి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News