చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రుద్రవరం యాదయ్యకు మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అభివృద్ధి కొనసాగాలంటే బిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో ఒకటో వార్డు ఇన్చార్జ్, రామన్నపేట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ మండలాధ్యక్షుడు రాములు, ఎన్నారం మాజీ సర్పంచ్ మెట్టు, మహేందర్ రెడ్డి, జనం పెల్లి ఉపసర్పంచ్ చొప్పరి నరసింహ, టీఆర్ఎస్ నాయకులు కోళ్ల కిషన్, రుద్రవరం సునీల్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి