Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:19 AM

రూ.7వేలు లంచం తీసుకుంటూ ఎస్ ఐ పట్టుబాటు. బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడి

రూ.7వేలు లంచం తీసుకుంటూ ఎస్ ఐ పట్టుబాటు. బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడి

రూ.7వేలు లంచం తీసుకుంటూ ఎస్ ఐ పట్టుబాటు. బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడి
06-05-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ చిట్టన్నోజు భాస్కర చారి అవినీతి నిర్మూలన బ్యూరో (ఏసీబీ) వలలో చిక్కాడు. రూ.7,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

ఫిర్యాదుదారుడి బంధువును క్రిమినల్ కేసులో ఇరికించకుండా ఉండేందుకు ఎస్సై ముందుగా రూ.10,000 డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడి విజ్ఞప్తితో ఆ మొత్తాన్ని రూ.7,000కు తగ్గించి, అదే మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వద్ద నుండి లంచంగా తీసుకున్న నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో అతను తన విధులను అవినీతిపరంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచారు.

నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

లంచం అడిగితే 1064కు ఫోన్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ సూచించింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపింది.

Sthanikam

రూ.7వేలు లంచం తీసుకుంటూ ఎస్ ఐ పట్టుబాటు. బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడి

Article Image

నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ చిట్టన్నోజు భాస్కర చారి అవినీతి నిర్మూలన బ్యూరో (ఏసీబీ) వలలో చిక్కాడు. రూ.7,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

ఫిర్యాదుదారుడి బంధువును క్రిమినల్ కేసులో ఇరికించకుండా ఉండేందుకు ఎస్సై ముందుగా రూ.10,000 డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడి విజ్ఞప్తితో ఆ మొత్తాన్ని రూ.7,000కు తగ్గించి, అదే మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వద్ద నుండి లంచంగా తీసుకున్న నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో అతను తన విధులను అవినీతిపరంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచారు.

నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

లంచం అడిగితే 1064కు ఫోన్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ సూచించింది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News