శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని పరిగి మండలంలో రూ.2 కోట్లు 10 లక్షల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు సవితమ్మ ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.
పాపిరెడ్డిపల్లి గ్రామం నుండి శ్రీరంగారాజుపల్లి వరకు రూ.1 కోటి 20 లక్షల వ్యయంతో సిసి రోడ్ నిర్మాణం చేపడుతున్నారు.మధుగిరి రోడ్డునుంచి పుట్టగూర్లపల్లి గ్రామం వరకు రూ.90 లక్షలతో సిసి రోడ్ నిర్మాణం చేపట్టనున్నారు.మొత్తం రూ.2.10 కోట్ల నిధులతో ఈ పనులకు భూమి పూజ చేశారు.ఈకార్యక్రమంలో పరిగి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ రహదారులు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయని స్థానికులు పేర్కొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి