PRINT TIME: July 04, 2026 04:04 AM
రూ.10 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
రూ.10 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
May 16, 2026 08:28 AM
41 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కొమురవెల్లి, అధికారిక పని చేసేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజు గౌడ్, సర్పంచ్ గొల్లపల్లి పద్మ భర్త గొల్లపల్లి అంజనేయులు ఏసీబీ అధికారులకు చిక్కారు.
ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్లాట్లో వేసిన డ్రైనేజీ పైప్లైన్ను తొలగించేందుకు కార్యదర్శి రూ.10 వేల లంచం కోరాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో దాడి నిర్వహించారు. కార్యదర్శి సూచనల మేరకు సర్పంచ్ భర్త అంజనేయులు లంచం నగదు స్వీకరిస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి