Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:40 PM

రోకలితో భార్య హత్య… వరంగల్‌లో దారుణం

రోకలితో భార్య హత్య… వరంగల్‌లో దారుణం

రోకలితో భార్య హత్య… వరంగల్‌లో దారుణం
March 10, 2026 12:09 PM 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వరంగల్: నగరంలోని 14వ డివిజన్ ఎస్‌ఆర్ నగర్‌లో సోమవారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ చివరకు హత్యకు దారి తీసింది.

పోలీసుల వివరాల ప్రకారం.. అబ్బరబోయిన రాజు, అనిత(40) దంపతులు. సోమవారం అనిత తన చిన్ననాన్న కర్మ కార్యక్రమానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.

కోపంతో ఆగ్రహానికి లోనైన రాజు ఇంట్లో ఉన్న రోకలితో అనిత తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అనిత మృతి చెందింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News