రోజుకో రూపాయి… రూ.8 కోట్ల స్కూల్ భవనం
రోజుకో రూపాయి… రూ.8 కోట్ల స్కూల్ భవనం
Biksham
పొదుపు మహిళల సంకల్పానికి నిలువెత్తు సాక్ష్యం
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా బాలభారతి విద్యాలయం
కర్నూలు జిల్లా:
రోజుకు రూపాయి పొదుపుతో కోట్ల విలువైన స్కూల్ భవనాన్ని నిర్మించడం అసాధ్యమనే భావనను సవాల్ చేస్తూ డ్వాక్రా పొదుపు మహిళలు ఓ అద్భుతాన్ని సృష్టించారు. అక్షరం ముక్క కూడా రాని వేలాది మహిళల సంకల్ప బలమే ఈ రోజు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నిలిచే బాలభారతి స్కూల్ భవనం రూపుదిద్దుకోవడానికి కారణమైంది.పిల్లలను పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో చదివించాలని అనుకున్నా ఆర్థిక స్థోమత లేని మహిళలు, వెనక్కి తగ్గలేదు. వేరే స్కూళ్లకు పంపలేకపోతే మనమే ఒక మంచి స్కూల్ నిర్మించుకుందామనే ఆలోచనతో ముందడుగు వేశారు. మాటలకే పరిమితం కాకుండా దానిని కార్యరూపం దాల్చేలా చేశారు.రూపాయి రూపాయి పొదుపు చేస్తూ, ఇటుక ఇటుక పేర్చుతూ, చెమటోడ్చి ఎనిమిదేళ్ల పాటు చేసిన కష్టానికి ఫలితమే ఈ రోజు మహారాజు ప్యాలెస్ను తలపించే స్కూల్ భవనం. సుమారు పది వేలమంది పొదుపు మహిళల శ్రమశక్తితో నిర్మితమైన ఈ భవనం ఇప్పుడు రెండు అంతస్తులతో విద్యార్థులకు విద్యానందిస్తోంది. మూడో అంతస్తు నిర్మాణం కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.తమకు చదువు లేకపోయినా కనీసం తమ పిల్లలైనా మంచి విద్యతో ముందుకు వెళ్లాలనే తపనే ఈ ఉద్యమానికి బీజం వేసింది. పేదరికం అడ్డంకి కాదని, ఐక్యతతో ఏదైనా సాధ్యమని నిరూపిస్తూ బాలభారతి స్కూల్ నేడు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది.ఈ స్కూల్ కేవలం ఒక భవనం కాదు. పొదుపు మహిళల ఆశల ప్రతిబింబం,విద్యపై వారి అపార విశ్వాసానికి సజీవ నిదర్శనం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి