రోడ్లు సరిచేయకుండా చలానాలు ఎందుకు?
రోడ్లు సరిచేయకుండా చలానాలు ఎందుకు?
K.RAVI
బీసీవై పార్టీ పిఏసి సభ్యుడు చిలకల శ్రీనివాస్ యాదవ్
చౌటుప్పల్ పట్టణంలో హైవే రోడ్డు విస్తరణ పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. రహదారులు సరిగా లేకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థల లేమి, తగినంత ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు.ఈ పరిస్థితుల్లో, ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా ఉన్నవారిపై చలానాలు విధించడం చట్టప్రకారం సరైనది కాదని బీసీవై పార్టీ రాష్ట్ర పి ఏ సి సభ్యుడు చిలకల శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రోడ్ల పనులు పూర్తి కాకపోవడంతో స్థానిక వ్యాపారులు, కిరాణా, కూరగాయల వ్యాపారులు కూడా వ్యాపారం నడపలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తగినంత ట్రాఫిక్ సిబ్బంది నియామకం, రోడ్ల పక్కన పార్కింగ్ నియంత్రణ, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు, రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయడం, రోడ్లు పూర్తిగా సరిగా తయారయ్యే వరకు చలానా విధానాలను సడలించాలని డిమాండ్ చేశారు. లేదంటే, బి సి వై పార్టీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చిలకల శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి