Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:51 PM

రోడ్డు ప్రమాద బాధితుడికి రికార్డు స్థాయిలో పరిహారం.. ఏకంగా రూ.2.95 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు!

రోడ్డు ప్రమాద బాధితుడికి రికార్డు స్థాయిలో పరిహారం.. ఏకంగా రూ.2.95 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు!

రోడ్డు ప్రమాద బాధితుడికి రికార్డు స్థాయిలో పరిహారం.. ఏకంగా రూ.2.95 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు!
February 21, 2026 09:42 PM 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత కుటుంబానికి రికార్డు స్థాయిలో పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని కర్నూలు కోర్టు ఆదేశించింది. కర్నూలుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎదురూరు రాజవర్ధన్ రెడ్డి 2022 ఏప్రిల్ 20న హైదరాబాదు నుంచి కర్నూలుకు ఫార్చ్యూనర్ కారులో వస్తుండగా మహబూబ్నగర్ జిల్లాలోని ఉండవల్లి దగ్గర రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య పులకుర్తి సౌజన్య, తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి ఉండవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు.

  1. రాజ వర్ధన్ రెడ్డి భార్య పిల్లలు తమ సీనియర్ న్యాయవాది ఎంఎల్ శ్రీనివాసరెడ్డి ద్వారా కర్నూలు జిల్లా కోర్టులో నష్టపరిహారం కోసం కేసు దాఖలు చేశారు. సదరు కారుకు లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా చేయించి ఉండటంతో వారు ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపరిహారం చెల్లించాలని కోర్టును కోరారు. ఈ మేరకు కోర్టు సాక్ష్యధారాలు పరిశీలించి మృతుడి వయస్సు, ఆదాయము, విద్యార్హతలు కుటుంబీకుల స్థితిగతులను పరిగణలోకి తీసుకుని ఆ కంపెనీ మృతుని కుటుంబీకులకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది._
  2. పిటిషనర్లైన మృతుని కుటుంబ సభ్యులకు రూ.2.2 కోట్లు తోపాటు 7.5 శాతం వడ్డీతో సహా మొత్తం రూ.2.95 కోట్లు చెల్లించాలని ఏడవ అదనపు జిల్లా న్యాయమూర్తి లక్ష్మీరాజ్యం తీర్పు చెప్పారు. ఇంత మొత్తంలో పరిహారం రావడం పట్ల మృతుడు రాజ వర్ధన్ రెడ్డి కుటుంబీకులు తమ న్యాయవాది ఎంఎల్ శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇంత భారీ మొత్తం నష్టపరిహారం చెల్లించమని ఒక భీమా కంపెనీకి కోర్టు ఆదేశించలేదని, ఇదే ప్రధమమని పలువురు న్యాయవాదులు చెబుతున్నారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News