PRINT TIME: May 26, 2026 04:53 PM
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.3 లక్షల బీమా అండ
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.3 లక్షల బీమా అండ
March 25, 2026 07:09 PM
138 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
సిటిజన్ బ్యాంక్ నుంచి ఆర్థిక సహాయం – కుటుంబానికి భరోసా
చౌటుప్పల్ పట్టణంలోని సిటిజన్ బ్యాంక్ శాఖలో ఖాతాదారుడిగా ఉన్న వెలిమినేడు గ్రామానికి చెందిన ఎంపాల వెంకటరెడ్డి (57) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంజూరైన రూ.3 లక్షల ప్రమాద బీమా మొత్తాన్ని బుధవారం సిటిజన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. నరేంద్ర కుమార్ చెక్కు రూపంలో మృతుడి భార్యకు అందజేశారు.ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ ఖాతాదారుల భద్రత కోసం అమలు చేస్తున్న బీమా పథకాలు అత్యంత ఉపయోగకరమని తెలిపారు. ప్రమాద సమయాల్లో ఇలాంటి పథకాలు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ జె. పూర్ణయ్య, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి