Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:44 PM

రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త : ట్రాఫిక్ ఎస్సై సాయిరాం

రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త : ట్రాఫిక్ ఎస్సై సాయిరాం

రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త : ట్రాఫిక్ ఎస్సై సాయిరాం
January 28, 2026 08:49 AM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

 స్థానికం ప్రతినిధి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కుడకుడ రోడ్డులో పాదచారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై సాయిరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత, పాదచారులు పాటించాల్సిన నియమాలపై వివరించారు.

ఈ సందర్భంగా ఎస్సై సాయిరాం మాట్లాడుతూ రోడ్డు దాటే సమయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించొద్దని సూచించారు. ఎప్పుడూ జీబ్రా క్రాసింగ్‌లనే ఉపయోగించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ లేదా హెడ్ ఫోన్లు పెట్టుకుని రోడ్డు దాటడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు.వాహనదారులు కూడా పాదచారుల ప్రాధాన్యతను గుర్తించి మలుపుల వద్ద వేగాన్ని తగ్గించాలని కోరారు. సురక్షిత ప్రయాణమే అందరి లక్ష్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News