PRINT TIME: April 11, 2026 03:17 PM
రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త : ట్రాఫిక్ ఎస్సై సాయిరాం
రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త : ట్రాఫిక్ ఎస్సై సాయిరాం
January 28, 2026 08:49 AM
15 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
స్థానికం ప్రతినిధి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కుడకుడ రోడ్డులో పాదచారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై సాయిరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత, పాదచారులు పాటించాల్సిన నియమాలపై వివరించారు.
ఈ సందర్భంగా ఎస్సై సాయిరాం మాట్లాడుతూ రోడ్డు దాటే సమయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించొద్దని సూచించారు. ఎప్పుడూ జీబ్రా క్రాసింగ్లనే ఉపయోగించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ లేదా హెడ్ ఫోన్లు పెట్టుకుని రోడ్డు దాటడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు.వాహనదారులు కూడా పాదచారుల ప్రాధాన్యతను గుర్తించి మలుపుల వద్ద వేగాన్ని తగ్గించాలని కోరారు. సురక్షిత ప్రయాణమే అందరి లక్ష్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి