Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:56 PM

రోడ్డు భద్రతకు ప్రాధాన్యం – గొర్రెకల్‌లో ఇరువైపులా గడ్డి తొలగింపు కార్యక్రమం

రోడ్డు భద్రతకు ప్రాధాన్యం – గొర్రెకల్‌లో ఇరువైపులా గడ్డి తొలగింపు కార్యక్రమం

రోడ్డు భద్రతకు ప్రాధాన్యం – గొర్రెకల్‌లో ఇరువైపులా గడ్డి తొలగింపు కార్యక్రమం
January 23, 2026 12:14 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ :వట్‌పల్లి మండలం పరిధిలో గొర్రెకల్ గ్రామ పంచాయతీ పరిధిలో పరిశుభ్రతతో పాటు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా, గొర్రెకల్ నుండి నాగులపల్లి వరకు మరియు గొర్రెకల్ నుండి వట్‌పల్లి వరకు ఉన్న ప్రధాన రహదారుల ఇరు వైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డి మరియు మూల పొదలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు ఇరువైపులా గడ్డి, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించడంతో పాటు, ముఖ్యంగా మూల మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ గడ్డి మరియు మూల పొదల కారణంగా గతంలో అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని, కొందరు ప్రాణాలు కూడా కోల్పోయిన బాధాకర సంఘటనలు ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే రాత్రి వేళల్లో పందులు ఈ గడ్డిలో నుంచి గుంపులుగా అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు పెరిగిన నేపథ్యంలో, ఈ సమస్యను గ్రామ ప్రజలు సర్పంచ్ గారి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సర్పంచ్ గారు వెంటనే చర్యలు చేపట్టి, రోడ్డు ఇరువైపులా ఉన్న గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించే పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గొర్రెకల్ గ్రామ సర్పంచ్ శ్రీ లింగారెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు పోలీస్ శేఖర్ పటేల్, బోయిని సత్యం, తిరుపతి శ్రీనివాస్ రెడ్డి, కాడారి కృష్ణా గౌడ్ లతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని, పనులను పర్యవేక్షించారు. గ్రామ పంచాయతీ చేపట్టిన ఈ చర్యలతో రోడ్డు భద్రత మరింత మెరుగుపడుతుందని, వాహనదారులకు మరియు గ్రామస్తులకు ఉపశమనం కలుగుతుందని పాల్గొన్నవారు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని గ్రామస్తులు కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News