Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:16 PM

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
January 22, 2026 03:21 PM 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అరైవ్ అలైవ్ మహా ఉద్యమంలో భాగంగా సూర్యాపేటలో భారీ అవగాహన ర్యాలీ

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం భారీ రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పి నరసింహ హాజరై ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, భారీ వాహనాల డ్రైవర్లు, స్థానిక యువత, పౌరులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు.స్థానిక అరవై అడుగుల రోడ్డునుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నళ్ళాభావి సెంటర్, వాణిజ్య భవన్, శంకర్ విలాస్ సెంటర్, ట్యాంక్ బండ్ చౌరస్తా మీదుగా సాగి ఏవీఎం పాఠశాల వద్ద ముగిసింది. అనంతరం ఏవీఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పి నరసింహ మాట్లాడుతూ విద్యార్థులు, డ్రైవర్లను ఉద్దేశించి రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు.

వేగ నియంత్రణ, హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ తప్పనిసరి, మద్యం సేవించి వాహనం నడపకూడదని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక డిఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, రూరల్ సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ సునీత, మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ ఆదిత్య, ఎస్ఐలు సాయిరాం, బాలు నాయక్, ఏడుకొండలు, శివతేజ, మహేందర్, శ్రీకాంత్, మహేష్, ఆటోమొబైల్ షోరూముల సంఘం అధ్యక్షుడు కమలాకర్, పోలీసు సిబ్బంది, ఆర్టీఏ సిబ్బంది, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News