Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:48 PM

రోడ్డు భద్రత, ప్రజల రక్షణే లక్ష్యం

రోడ్డు భద్రత, ప్రజల రక్షణే లక్ష్యం

రోడ్డు భద్రత, ప్రజల రక్షణే లక్ష్యం
February 21, 2026 07:08 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ఐ పీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ కె.వి. మహేష్ ఆధ్వర్యంలో ఈ రోజు లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌవలసముద్రం టోల్ ప్లాజా రోడ్డుపై ప్రత్యేక వాహన తనిఖీ కార్యక్రమం నిర్వహించినట్లు హిందూపురం రూరల్ సర్కిల్ సీఐ జనార్ధన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో లేపాక్షి ఎస్‌ఐ నరేంద్ర మరియు పోలీసు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. సందర్భంగా సిఐ,జనార్ధన్ మాట్లాడుతూ..

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని,

హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులకు హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను వివరించి, నిర్లక్ష్యంగా వాహనం నడిపితే జరిగే ప్రమాదాలపై కౌన్సెలింగ్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో స్పష్టంగా తెలియజేశారు.

అవగాహన కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. భవిష్యత్తులో తప్పకుండా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమాలు పాటిస్తామని వాహనదారులు హామీ ఇచ్చారని సీఐ తెలిపారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రాణ రక్షణకే హెల్మెట్ ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీఐ జనార్ధన్ ప్రజలను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News