Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

రోడ్డు భద్రత, ప్రజల రక్షణే లక్ష్యం

రోడ్డు భద్రత, ప్రజల రక్షణే లక్ష్యం

రోడ్డు భద్రత, ప్రజల రక్షణే లక్ష్యం
February 21, 2026 07:08 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ఐ పీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ కె.వి. మహేష్ ఆధ్వర్యంలో ఈ రోజు లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌవలసముద్రం టోల్ ప్లాజా రోడ్డుపై ప్రత్యేక వాహన తనిఖీ కార్యక్రమం నిర్వహించినట్లు హిందూపురం రూరల్ సర్కిల్ సీఐ జనార్ధన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో లేపాక్షి ఎస్‌ఐ నరేంద్ర మరియు పోలీసు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. సందర్భంగా సిఐ,జనార్ధన్ మాట్లాడుతూ..

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని,

హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులకు హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను వివరించి, నిర్లక్ష్యంగా వాహనం నడిపితే జరిగే ప్రమాదాలపై కౌన్సెలింగ్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో స్పష్టంగా తెలియజేశారు.

అవగాహన కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. భవిష్యత్తులో తప్పకుండా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమాలు పాటిస్తామని వాహనదారులు హామీ ఇచ్చారని సీఐ తెలిపారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రాణ రక్షణకే హెల్మెట్ ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీఐ జనార్ధన్ ప్రజలను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News