రోడ్డు భద్రత.. చిన్నారుల బాధ్యత!
రోడ్డు భద్రత.. చిన్నారుల బాధ్యత!
K.RAVI
యాదాద్రి జిల్లాలో ఉత్సాహంగా ‘అరైవ్ అలైవ్’ క్యాంపెయిన్
ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులతో ప్రతిజ్ఞ
తల్లిదండ్రులకు పిల్లల లేఖలు: ‘హెల్మెట్ పెట్టుకో.. క్షేమంగా రా!’
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026’ లో భాగంగా బుధవారం చౌటుప్పల్ పట్టణంలో ‘పిల్లల రోడ్డు భద్రత దినోత్సవం’ ఘనంగా నిర్వహించారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో చైతన్య పాఠశాల యాజమాన్యం సహకారంతో విద్యార్థులకు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
రోడ్డును సురక్షితంగా ఎలా దాటాలి?
స్కూల్ బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు.
స్కూల్ పరిసరాల్లో వాహనాల వేగ నియంత్రణ.
హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.
నాన్నకు ప్రేమతో.. భద్రత లేఖ
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు భావోద్వేగపూరితమైన లేఖలు రాశారు. "నాన్నా.. నువ్వు వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించు, సీట్ బెల్ట్ పెట్టుకో.. నీ కోసం మేము ఇంట్లో ఎదురుచూస్తుంటాం" అంటూ పిల్లలు రాసిన లేఖలు అందరినీ ఆలోచింపజేశాయి. అనంతరం విద్యార్థులందరితో కలిసి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పట్టణంలో విద్యార్థులు, పోలీసులు కలిసి భారీ మానవహారం, అవగాహన ర్యాలీ నిర్వహించారు. ట్రిపుల్ రైడింగ్ను నివారించాలని, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించవద్దని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విజయ్ మోహన్, ఎస్.ఐ. ఉపేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి