Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:10 AM

రోడ్డు భద్రత.. చిన్నారుల బాధ్యత!

రోడ్డు భద్రత.. చిన్నారుల బాధ్యత!

రోడ్డు భద్రత.. చిన్నారుల బాధ్యత!
April 15, 2026 03:25 PM 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి జిల్లాలో ఉత్సాహంగా ‘అరైవ్ అలైవ్’ క్యాంపెయిన్

ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులతో ప్రతిజ్ఞ

తల్లిదండ్రులకు పిల్లల లేఖలు: ‘హెల్మెట్ పెట్టుకో.. క్షేమంగా రా!’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026’ లో భాగంగా బుధవారం చౌటుప్పల్ పట్టణంలో ‘పిల్లల రోడ్డు భద్రత దినోత్సవం’ ఘనంగా నిర్వహించారు. చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో చైతన్య పాఠశాల యాజమాన్యం సహకారంతో విద్యార్థులకు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించారు.​ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

రోడ్డును సురక్షితంగా ఎలా దాటాలి?

స్కూల్ బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు.

స్కూల్ పరిసరాల్లో వాహనాల వేగ నియంత్రణ.

హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.

నాన్నకు ప్రేమతో.. భద్రత లేఖ

​కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు భావోద్వేగపూరితమైన లేఖలు రాశారు. "నాన్నా.. నువ్వు వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించు, సీట్ బెల్ట్ పెట్టుకో.. నీ కోసం మేము ఇంట్లో ఎదురుచూస్తుంటాం" అంటూ పిల్లలు రాసిన లేఖలు అందరినీ ఆలోచింపజేశాయి. అనంతరం విద్యార్థులందరితో కలిసి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ​అనంతరం పట్టణంలో విద్యార్థులు, పోలీసులు కలిసి భారీ మానవహారం, అవగాహన ర్యాలీ నిర్వహించారు. ట్రిపుల్ రైడింగ్‌ను నివారించాలని, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించవద్దని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ విజయ్ మోహన్, ఎస్.ఐ. ఉపేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News