Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేయొద్దు

రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేయొద్దు

రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేయొద్దు
March 24, 2026 04:32 PM 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు అధికారి నరసింహ ఆదేశాల మేరకు “ఆపరేషన్ రోప్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఉపనిరీక్షకుడు సాయిరాం తెలిపారు.

మంగళవారం పట్టణంలోని కుడకుడ రోడ్డులో మున్సిపాలిటీ అధికారులతో కలిసి రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. అలాగే మట్టి కుప్పలు, చెత్త, రాళ్లను తొలగించి రోడ్డు సక్రమంగా కనిపించేలా చర్యలు చేపట్టారు.

పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, ప్రజలు మరియు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడడం, ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఆక్రమణలు, అనధికారిక పార్కింగ్ తొలగించి వాహనాలు క్రమబద్ధంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News