రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేయొద్దు
రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేయొద్దు
Biksham
పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసు అధికారి నరసింహ ఆదేశాల మేరకు “ఆపరేషన్ రోప్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఉపనిరీక్షకుడు సాయిరాం తెలిపారు.
మంగళవారం పట్టణంలోని కుడకుడ రోడ్డులో మున్సిపాలిటీ అధికారులతో కలిసి రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. అలాగే మట్టి కుప్పలు, చెత్త, రాళ్లను తొలగించి రోడ్డు సక్రమంగా కనిపించేలా చర్యలు చేపట్టారు.
పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, ప్రజలు మరియు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడడం, ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఆక్రమణలు, అనధికారిక పార్కింగ్ తొలగించి వాహనాలు క్రమబద్ధంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి