Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:29 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
01-02-2026 186 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మండల పరిధిలోని ఆరెగూడెం స్టేజీ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓయువకుడు ప్రాణాలు కోల్పోయాడు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.హైదరాబాద్ లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహమ్మద్ కాజా ఫయాజుద్దీన్ (35) తన సొంత ఊరైన నల్గొండకు తనతమ్ముడి బుల్లెట్ బైక్ పై బయలుదేరాడు.మధ్యాహ్నం 01:34 గంటల సమయంలో ఆరెగూడెం స్టేజీ వద్దకు చేరుకోగా, అదే సమయంలో ముందున్నలారీ డ్రైవర్ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నాడు.దీంతో వేగంగా వస్తున్న బుల్లెట్ బైక్ లారీని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఫయాజుద్దీన్ కింద పడిపోగా,అతనికి ఛాతి లోపలి భాగంలో తీవ్రమైన గాయాలు అయ్యాయి.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు.బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతుడి తమ్ముడు మహమ్మద్ కాజా ఫహిము ద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నర్సిరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Sthanikam

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Article Image

మండల పరిధిలోని ఆరెగూడెం స్టేజీ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓయువకుడు ప్రాణాలు కోల్పోయాడు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.హైదరాబాద్ లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహమ్మద్ కాజా ఫయాజుద్దీన్ (35) తన సొంత ఊరైన నల్గొండకు తనతమ్ముడి బుల్లెట్ బైక్ పై బయలుదేరాడు.మధ్యాహ్నం 01:34 గంటల సమయంలో ఆరెగూడెం స్టేజీ వద్దకు చేరుకోగా, అదే సమయంలో ముందున్నలారీ డ్రైవర్ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నాడు.దీంతో వేగంగా వస్తున్న బుల్లెట్ బైక్ లారీని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఫయాజుద్దీన్ కింద పడిపోగా,అతనికి ఛాతి లోపలి భాగంలో తీవ్రమైన గాయాలు అయ్యాయి.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు.బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతుడి తమ్ముడు మహమ్మద్ కాజా ఫహిము ద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నర్సిరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News