రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
K.RAVI
మండల పరిధిలోని ఆరెగూడెం స్టేజీ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓయువకుడు ప్రాణాలు కోల్పోయాడు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.హైదరాబాద్ లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహమ్మద్ కాజా ఫయాజుద్దీన్ (35) తన సొంత ఊరైన నల్గొండకు తనతమ్ముడి బుల్లెట్ బైక్ పై బయలుదేరాడు.మధ్యాహ్నం 01:34 గంటల సమయంలో ఆరెగూడెం స్టేజీ వద్దకు చేరుకోగా, అదే సమయంలో ముందున్నలారీ డ్రైవర్ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నాడు.దీంతో వేగంగా వస్తున్న బుల్లెట్ బైక్ లారీని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఫయాజుద్దీన్ కింద పడిపోగా,అతనికి ఛాతి లోపలి భాగంలో తీవ్రమైన గాయాలు అయ్యాయి.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు.బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతుడి తమ్ముడు మహమ్మద్ కాజా ఫహిము ద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నర్సిరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి