Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:52 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
February 01, 2026 08:38 AM 177 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మండల పరిధిలోని ఆరెగూడెం స్టేజీ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓయువకుడు ప్రాణాలు కోల్పోయాడు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.హైదరాబాద్ లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహమ్మద్ కాజా ఫయాజుద్దీన్ (35) తన సొంత ఊరైన నల్గొండకు తనతమ్ముడి బుల్లెట్ బైక్ పై బయలుదేరాడు.మధ్యాహ్నం 01:34 గంటల సమయంలో ఆరెగూడెం స్టేజీ వద్దకు చేరుకోగా, అదే సమయంలో ముందున్నలారీ డ్రైవర్ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నాడు.దీంతో వేగంగా వస్తున్న బుల్లెట్ బైక్ లారీని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఫయాజుద్దీన్ కింద పడిపోగా,అతనికి ఛాతి లోపలి భాగంలో తీవ్రమైన గాయాలు అయ్యాయి.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు.బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతుడి తమ్ముడు మహమ్మద్ కాజా ఫహిము ద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నర్సిరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News