రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుర్తు తెలియని వ్యక్తి – కుటుంబ సభ్యులు ఎక్కడ?
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుర్తు తెలియని వ్యక్తి – కుటుంబ సభ్యులు ఎక్కడ?
Krishna
వట్ పల్లి నుండి రాయిపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై, వట్ పల్లి గ్రామ శివారులో వెంకట్ గౌడ్ వారి కోళ్ళ ఫాం సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఘటనాస్థలంలోనే మరణించినట్లు సమాచారం అందింది.వెంటనే వట్ పల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఎస్.ఐ సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి భద్రపరచినారు.మృతుడు వయస్సు సుమారు 28 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండవచ్చును. తెలుపు వర్ణం కలిగి సుమారు 5 అడుగులు 5 అంగుళాల ఎత్తు గలవాడు. కుడి చేతికి పసుపు రంగు దారం ధరించి ఉన్నాడు. మెడలో పసుపు రంగు దారంతో పాటు రుద్రాక్ష ధరించి ఉన్నాడు. నడుముకు రంగురంగుల మొలతాడు దారం ఉంది. కాళ్లకు శాండిల్ చెప్పులు ధరించి ఉన్నాడు. నలుపు రంగు డ్రాయర్, తెలుపు రంగు ప్యాంటు మరియు తెలుపు రంగు డబ్బా డిజైన్ గల పూల్ షర్టు ధరించి ఉన్నాడు.పై వివరాలు మరియు ఫోటో ఆధారంగా మృతుని గురించి పూర్తి సమాచారం తెలిసిన వారు వట్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ లవ కుమార్ సెల్ నంబర్ 8712656755 లేదా జోగిపేట్ సి.ఐ అనిల్ కుమార్ సెల్ నంబర్ 8712656723 కు సమాచారం అందించగలరు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి