Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 01:16 AM

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుర్తు తెలియని వ్యక్తి – కుటుంబ సభ్యులు ఎక్కడ?

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుర్తు తెలియని వ్యక్తి – కుటుంబ సభ్యులు ఎక్కడ?

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుర్తు తెలియని వ్యక్తి – కుటుంబ సభ్యులు ఎక్కడ?
19-02-2026 484 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వట్ పల్లి నుండి రాయిపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై, వట్ పల్లి గ్రామ శివారులో వెంకట్ గౌడ్ వారి కోళ్ళ ఫాం సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఘటనాస్థలంలోనే మరణించినట్లు సమాచారం అందింది.వెంటనే వట్ పల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఎస్.ఐ సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి భద్రపరచినారు.మృతుడు వయస్సు సుమారు 28 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండవచ్చును. తెలుపు వర్ణం కలిగి సుమారు 5 అడుగులు 5 అంగుళాల ఎత్తు గలవాడు. కుడి చేతికి పసుపు రంగు దారం ధరించి ఉన్నాడు. మెడలో పసుపు రంగు దారంతో పాటు రుద్రాక్ష ధరించి ఉన్నాడు. నడుముకు రంగురంగుల మొలతాడు దారం ఉంది. కాళ్లకు శాండిల్ చెప్పులు ధరించి ఉన్నాడు. నలుపు రంగు డ్రాయర్, తెలుపు రంగు ప్యాంటు మరియు తెలుపు రంగు డబ్బా డిజైన్ గల పూల్ షర్టు ధరించి ఉన్నాడు.పై వివరాలు మరియు ఫోటో ఆధారంగా మృతుని గురించి పూర్తి సమాచారం తెలిసిన వారు వట్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ లవ కుమార్ సెల్ నంబర్ 8712656755 లేదా జోగిపేట్ సి.ఐ అనిల్ కుమార్ సెల్ నంబర్ 8712656723 కు సమాచారం అందించగలరు.

Sthanikam

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుర్తు తెలియని వ్యక్తి – కుటుంబ సభ్యులు ఎక్కడ?

Article Image

వట్ పల్లి నుండి రాయిపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై, వట్ పల్లి గ్రామ శివారులో వెంకట్ గౌడ్ వారి కోళ్ళ ఫాం సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఘటనాస్థలంలోనే మరణించినట్లు సమాచారం అందింది.వెంటనే వట్ పల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఎస్.ఐ సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి భద్రపరచినారు.మృతుడు వయస్సు సుమారు 28 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండవచ్చును. తెలుపు వర్ణం కలిగి సుమారు 5 అడుగులు 5 అంగుళాల ఎత్తు గలవాడు. కుడి చేతికి పసుపు రంగు దారం ధరించి ఉన్నాడు. మెడలో పసుపు రంగు దారంతో పాటు రుద్రాక్ష ధరించి ఉన్నాడు. నడుముకు రంగురంగుల మొలతాడు దారం ఉంది. కాళ్లకు శాండిల్ చెప్పులు ధరించి ఉన్నాడు. నలుపు రంగు డ్రాయర్, తెలుపు రంగు ప్యాంటు మరియు తెలుపు రంగు డబ్బా డిజైన్ గల పూల్ షర్టు ధరించి ఉన్నాడు.పై వివరాలు మరియు ఫోటో ఆధారంగా మృతుని గురించి పూర్తి సమాచారం తెలిసిన వారు వట్ పల్లి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ లవ కుమార్ సెల్ నంబర్ 8712656755 లేదా జోగిపేట్ సి.ఐ అనిల్ కుమార్ సెల్ నంబర్ 8712656723 కు సమాచారం అందించగలరు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News