PRINT TIME: May 26, 2026 03:16 PM
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యాతాకుల సునీల్ను పరామర్శించిన సి.పి.ఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ నేతలు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యాతాకుల సునీల్ను పరామర్శించిన సి.పి.ఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ నేతలు
February 12, 2026 06:22 PM
60 Views
స్థానికం ప్రతినిధి :
Suryapet
Vikram Journalist
ఇటీవల సూర్యాపేట జిల్లా నాగారం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సామాజిక కార్యకర్త, పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ యాతాకుల సునీల్ హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో వారం రోజులపాటు చికిత్స పొందారు. ఆరోగ్యం కొంతమేరకు కుదుటపడడంతో ప్రస్తుతం సూర్యాపేట భగత్ సింగ్ నగర్లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న సి.పి.ఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ రాష్ట్ర కార్యదర్శి మొల్గురి సైదులు, జిల్లా కార్యదర్శి బానోత్ రామచందర్, విద్యార్థి సంఘ నాయకుడు బానోత్ నరేందర్ గురువారం సునీల్ను పరామర్శించి ఆరోగ్యం త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించిన సి.పి.ఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ క్యాలెండర్ను అందజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి