Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:47 AM

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
March 10, 2026 09:20 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- బాధిత కుటుంబానికి రూ.1 లక్ష తక్షణ ఆర్థిక సహాయం

భువనగిరి మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోమవారం వనపర్తి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన తెలిసిందే. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం ఉదయం తిమ్మాపురం గ్రామానికి చేరుకుని మృతుల నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా తన వంతు సహకారంగా రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.ఈ ఘటన పట్ల ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ద్వారా కూడా బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,గ్రామ శాఖ అధ్యక్షులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News