Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:48 PM

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
March 10, 2026 09:20 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- బాధిత కుటుంబానికి రూ.1 లక్ష తక్షణ ఆర్థిక సహాయం

భువనగిరి మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోమవారం వనపర్తి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన తెలిసిందే. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం ఉదయం తిమ్మాపురం గ్రామానికి చేరుకుని మృతుల నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా తన వంతు సహకారంగా రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.ఈ ఘటన పట్ల ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ద్వారా కూడా బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,గ్రామ శాఖ అధ్యక్షులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News