PRINT TIME: July 03, 2026 07:03 AM
రొద్దం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.50 లక్షల పబ్లిక్ హెల్త్ యూనిట్ ప్రారంభం
రొద్దం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.50 లక్షల పబ్లిక్ హెల్త్ యూనిట్ ప్రారంభం
May 01, 2026 08:49 PM
63 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రూ.50 లక్షల నిధులతో నిర్మించిన పబ్లిక్ హెల్త్ యూనిట్ బ్లాక్ను బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత ఘనంగా ప్రారంభించారు. ఈ నూతన బ్లాక్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలకు సమయానికి చికిత్స అందించేందుకు ఇలాంటి సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, మండల స్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి