రంజాన్ ఉపవాసంలో ఆధ్యాత్మికత–మానవత్వం సందేశం
రంజాన్ ఉపవాసంలో ఆధ్యాత్మికత–మానవత్వం సందేశం
EDIGA NAVEENKUMAR
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో రోజా ఆచరిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లి మండల కేంద్రంలోని జామియా మజీద్లో ఆదివారం రంజాన్ మాసం నాలుగవ రోజా (ఉపవాస దీక్ష)ను ముస్లిం మైనారిటీలు నియమ నిష్ఠలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా మౌలానా ఇలియాజ్ ప్రార్థనల అనంతరం ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఒక్కపూట భోజనం కోసం కూడా కష్టాలు పడుతున్నారని తెలిపారు. మనిషికి ఆకలి విలువను, అన్నం ప్రాముఖ్యతను తెలియజేసేది రోజా అని ఆయన పేర్కొన్నారు.
రంజాన్ ఉపవాసం కేవలం ఆహారం మానుకోవడం మాత్రమే కాదని, మనసును శుద్ధి చేసుకొని దయ, కరుణ, సహానుభూతి వంటి మానవ విలువలను పెంపొందించుకునే పవిత్ర సాధనమని వివరించారు. ఆహారాన్ని వృథా చేయకుండా అవసరమైన వారికి పంచుకోవాలని, అన్నదానం చేయడం ద్వారా సమాజంలో సహకార భావం పెరుగుతుందని పిలుపునిచ్చారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక నమాజ్లు నిర్వహిస్తూ శాంతి, సామరస్యానికి ప్రార్థనలు చేశారు. రంజాన్ మాసం మానవత్వాన్ని గుర్తుచేసే ఆధ్యాత్మిక సాధనంగా నిలుస్తుందని మత పెద్దలు అభిప్రాయపడ్డారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి