రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తేలుకుంట్ల వెంకటేశ్వర్లు కన్నుమూత
రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు తేలుకుంట్ల వెంకటేశ్వర్లు కన్నుమూత
Komidala Mahender reddy
చిట్యాల మండలంలో సుదీర్ఘకాలం విద్యా సేవలు అందించిన ఎలికట్టే గ్రామ వాసి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మరియు చిట్యాల మండల TSUTF పూర్వ అధ్యక్షులు శ్రీ తేలుకుంట్ల వెంకటేశ్వర్లు ఈరోజు మలక్పేటలోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. గత 15 రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఈరోజు తుదిశ్వాస విడిచారు.
విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయ సంఘ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సహచర ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘ నాయకులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శ్రీ తేలుకుంట్ల వెంకటేశ్వర్లు మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ TAPRPA నల్లగొండ జిల్లా కోశాధికారి & రాష్ట్ర కమిటీ సభ్యులు కుకుడాల గోవర్ధన్ (Rtd GHM) సంతాపం ప్రకటించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి