Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

రిటైర్ అధికారులకు ఎస్పీ చేతుల మీదుగా ఘన సన్మానం

రిటైర్ అధికారులకు ఎస్పీ చేతుల మీదుగా ఘన సన్మానం

రిటైర్ అధికారులకు ఎస్పీ చేతుల మీదుగా ఘన సన్మానం
March 31, 2026 09:03 PM 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పదవి విరమణ కార్యక్రమంలో ఎస్ఐ మొగులయ్య, ఆర్‌ఎస్‌ఐ ఖదీరుద్దీన్, పీసీ శ్రీనివాస్ రెడ్డి లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో పదవి విరమణ సహజమైనదే అయినప్పటికీ, వారు పోలీసు శాఖకు అందించిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. 1987లో కానిస్టేబుల్‌గా చేరిన మొగులయ్య నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ధైర్యంగా విధులు నిర్వహిస్తూ, ఎలాంటి రిమార్క్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి చేరుకోవడం ఆయన నిబద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు. 1983లో ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్‌గా చేరిన ఖదీరుద్దీన్ కమాండెంట్ రైటర్, డీఎస్పీ రైటర్, ఆర్‌ఐ రైటర్ వంటి బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వహిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుని ఆర్‌ఎస్‌ఐ హోదాకు ఎదగడం విశేషమన్నారు. 1993లో కానిస్టేబుల్‌గా చేరిన శ్రీనివాస్ రెడ్డి సాధారణ విధులతో పాటు రైల్వే విభాగంలో కూడా సమర్థవంతంగా సేవలందించి మంచి గుర్తింపు పొందారని తెలిపారు. ఈ ముగ్గురు అధికారులు అందించిన సేవలు మారువలేనివని కొనియాడుతూ, రిటైర్మెంట్ అనంతరం వారికి రావలసిన అన్ని బెనిఫిట్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే వారు ఆరోగ్యంగా ఉండి కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కళ్యాణి, ఎఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, సదా నాగరాజు, ప్రవీణ్ రెడ్డి, నాగేశ్వర్ రావు, ఆర్‌ఐలు రాజశేఖర్, డానియెల్, సురేష్ మరియు రిటైర్ అవుతున్న అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News