రిపబ్లిక్ డే ఉత్సవాలలో స్కూల్ గేమ్స్ హుషారు
రిపబ్లిక్ డే ఉత్సవాలలో స్కూల్ గేమ్స్ హుషారు
Komidala Mahender reddy
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
ఫైనలిస్టులకు డైరెక్టర్ వేణు గోపాల్ రెడ్డి శుభాకాంక్షలు
రిపబ్లిక్ డే సందర్భంగా చిట్యాల లోని గ్రీన్ గ్రో పాఠశాలలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీలు విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని నింపాయి. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చి ఫైనల్స్కు చేరుకున్న విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విజయం–పరాజయాలను సమానంగా స్వీకరిస్తూ, క్రమశిక్షణతో ఉత్తమంగా ఆడితేనే నిజమైన క్రీడాకారులవుతారు” అని సూచించారు. ఫైనల్ మ్యాచ్ల్లోనూ ఇదే ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో తమ ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు.
క్రీడా కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, జట్టు స్పూర్తిని పెంపొందిస్తాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి