Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:54 PM

రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సివిల్ సప్లై అధికారులకు ఘన సత్కారం

రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సివిల్ సప్లై అధికారులకు ఘన సత్కారం

రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సివిల్ సప్లై అధికారులకు ఘన సత్కారం
January 23, 2026 07:01 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎలుగల రాజయ్య

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

రాష్ట్రంలో రైతుల ధాన్యం సేకరణలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిన సందర్భంగా,జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సివిల్ సప్లై అధికారి రోజా రాణి మేడమ్‌ను,జిల్లా సివిల్ సప్లై మేనేజర్ హరికృష్ణను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎలుగల రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపినందుకు గుర్తింపుగా వారిద్దరికీ శాలువాలతో సత్కారం చేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర రేషన్ డీలర్ల ప్రధాన కార్యదర్శి కందుల శంకర్,రాష్ట్ర సహాయ కార్యదర్శులు,జిల్లా ఉపాధ్యక్షులు సుర్వి వెంకటేష్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి కోయడ వెంకటేష్,జిల్లా కోశాధికారి ఎడ్ల ఉమా దర్శన్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు సువర్ణ నర్సిరెడ్డి,మోత్కూరు ఐఎంజి పాయింట్ అధ్యక్షులు సైదులు,భువనగిరి మండల అధ్యక్షులు,రాష్ట్ర సహాయ కార్యదర్శి గంగాదేవి మహేష్,వలిగొండ మండల అధ్యక్షులు పాశం స్వామి,రాజపేట మండల అధ్యక్షులు పోచయ్య,భువనగిరి మండల ఉపాధ్యక్షులు మల్లేష్,ప్రధాన కార్యదర్శి కూరాకుల శ్రీనివాస్,చౌటుప్పల్ మండల ఉపాధ్యక్షులు సత్యంతో పాటు అన్ని మండలాల రేషన్ డీలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,రైతులకు తక్షణమే న్యాయం కలిగేలా ధాన్యం సేకరణను సమర్థవంతంగా నిర్వహించిన అధికారుల కృషి అభినందనీయమని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News