రేపు జహీరాబాద్ లో ప్రజల భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రత కార్యక్రమం పిలుపు:ఎస్ఐ చైతన్య కిరణ్
రేపు జహీరాబాద్ లో ప్రజల భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రత కార్యక్రమం పిలుపు:ఎస్ఐ చైతన్య కిరణ్
Krishna
సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:రాయికోడ్ మండల కేంద్రంలో పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఎస్ఐ చైతన్య కిరణ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ....జహీరాబాద్ సబ్ డివిజన్ లో జహీరాబాద్ డిఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్స్ శివలింగం, జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు,ఆధ్వర్యంలో ప్రజల భద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమం 21 తారీకు (బుధవారం) ఉదయం 10 గంటలకు జహీరాబాద్ పట్టణంలోని ఎన్ కన్వెన్షన్లో జరగనుంది. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సంబంధించిన అధికారులు హాజరుకానున్నారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, వాహనదారులు నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు,యువత, పెద్దలు,వృద్ధులు,విద్యార్థులు,మీడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా హాజరై రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. రోడ్డు నిబంధనలు పాటిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం అనే సందేశాన్ని ఈ సందర్భంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి