సాయంత్రం 4.34 నుంచి 5.33 వరకు సంపూర్ణ దశ
దేశ వ్యాప్తంగా రేపు అరుదైన ఖగోళ సంఘటనగా సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం సాయంత్రం 6.48 గంటలకు ముగియనుంది. ఇందులో సాయంత్రం 4.34 గంటల నుంచి 5.33 గంటల మధ్య సంపూర్ణ గ్రహణ దశ కొనసాగుతుంది.
భారతదేశంలో సూర్యాస్తమయ సమయానికి అనుసరించి సాయంత్రం 6.20 గంటల నుంచి సుమారు 27 నిమిషాల పాటు గ్రహణం దర్శనమివ్వనుంది. అండమాన్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల కొంత భాగం మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం వీక్షించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే గ్రహణం స్పష్టంగా కనిపించే అవకాశముందని పేర్కొన్నారు. ఇక భారత్లో తదుపరి సంపూర్ణ చంద్రగ్రహణం 2028 డిసెంబరు 31న సంభవించనుంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి