Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:44 AM

రేపటి నుంచి చిన్న శ్రీశైలం బ్రహ్మోత్సవాల మహోత్సాహం

రేపటి నుంచి చిన్న శ్రీశైలం బ్రహ్మోత్సవాల మహోత్సాహం

రేపటి నుంచి చిన్న శ్రీశైలం బ్రహ్మోత్సవాల మహోత్సాహం
February 14, 2026 05:23 PM 276 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామం మరోసారి ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది. చిన్న శ్రీశైలంగా పేరుగాంచిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 వరకు భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించనున్నారు.

శివరాత్రి సందర్భంగా ఆదివారం ఉదయం గణపతి పూజ, అనంతరం ధ్వజారోహణతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారు గుట్టపైకి వెళ్లే కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనుంది.

సోమవారం (16న) రాత్రి 11.45 గంటల నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవం, తలంబ్రాల కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఈ వేడుకకు పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.

మంగళవారం (17న) తెల్లవారుజామున 6.25 గంటలకు అగ్నిగుండాల కార్యక్రమం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిర్వహించనున్నారు. అనంతరం 18న ఉదయం 8 గంటల నుంచి గెలుపు ఉత్సవాలు, మహాదాశీర్వచనాలు జరుగుతాయని సిద్ధాంతి బ్రహ్మశ్రీ బేతోజి సత్యనారాయణ శాస్త్రి,సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ సల్ల నరసింహ తెలియజేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News