రేపటి నుంచి చిన్న శ్రీశైలం బ్రహ్మోత్సవాల మహోత్సాహం
రేపటి నుంచి చిన్న శ్రీశైలం బ్రహ్మోత్సవాల మహోత్సాహం
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామం మరోసారి ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది. చిన్న శ్రీశైలంగా పేరుగాంచిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 వరకు భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించనున్నారు.
శివరాత్రి సందర్భంగా ఆదివారం ఉదయం గణపతి పూజ, అనంతరం ధ్వజారోహణతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారు గుట్టపైకి వెళ్లే కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనుంది.
సోమవారం (16న) రాత్రి 11.45 గంటల నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవం, తలంబ్రాల కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఈ వేడుకకు పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
మంగళవారం (17న) తెల్లవారుజామున 6.25 గంటలకు అగ్నిగుండాల కార్యక్రమం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిర్వహించనున్నారు. అనంతరం 18న ఉదయం 8 గంటల నుంచి గెలుపు ఉత్సవాలు, మహాదాశీర్వచనాలు జరుగుతాయని సిద్ధాంతి బ్రహ్మశ్రీ బేతోజి సత్యనారాయణ శాస్త్రి,సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ సల్ల నరసింహ తెలియజేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి