Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:09 AM

రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశలు ఆందోళన

రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశలు ఆందోళన

రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశలు ఆందోళన
March 31, 2026 09:03 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశలు ఆందోళన

కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ మేరకు రూ.18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని,ఉద్యోగ భద్రత, హెల్త్ ఇన్సూరెన్స్,ప్రమాద బీమా,ప్రసూతి సెలవులు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళనలో

భాగంగా మంగళవారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల పీ.హెచ్.సీ పరిధిలోని ఆశాలు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా పలువురు ఆశాలు మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని,అలా చేయనంతవరకు సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ప్రస్తుతం ఆశా వర్కర్లకు ఇన్సెంటివ్ ఆధారంగా సుమారు రూ.9,900 మాత్రమే అందుతోందని,అది కూడా సకాలంలో రావడం లేదని, కనీస వేతనం కూడా లభించడం లేదని ఆరోపించారు.“మేము గ్రామీణ,పేదల ఆరోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నామని, మాతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఉద్యోగ భద్రత,హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా,ప్రసూతి సెలవులు లేకుండా,అదనపు

పనులు,రికార్డులు,ఆన్లైన్ అప్లోడింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి

ఆశాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ భద్రత, హెల్త్ ఇన్సూరెన్స్,ప్రమాద బీమా,ప్రసూతి సెలవులతో పాటు సబ్ సెంటర్ డ్యూటీల

వంటి ,పని వత్తిడి తగ్గించి, రూ.18000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ లీడర్లు జి.భాగ్యలక్ష్మి,సుధారాణి, నాగమణి,మయూరి,భారతి, అరుణ,అలివేలు,జ్యోతి, రమణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News