శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం రేణుకనగర్లో కోళ్ల ఆకస్మిక మరణం కలకలం రేపింది. రెండు కుటుంబాలకు చెందిన సుమారు 50 కోళ్లు ఒక్కసారిగా మృతి చెందడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
బాధిత రైతులు ఇది సహజ మరణం కాదని, ఎవరైనా కావాలని విషప్రయోగం చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనోపాధి అయిన కోళ్లను ఇలా చంపేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై అధికారులు స్పందించి దర్యాప్తు చేపట్టాలని, మృతికి గల అసలు కారణాలను గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి