రేణుక ఎల్లమ్మ తల్లి పండుగలో పాల్గొన్న సర్వోత్తమ్ రెడ్డి, భాస్కర్
రేణుక ఎల్లమ్మ తల్లి పండుగలో పాల్గొన్న సర్వోత్తమ్ రెడ్డి, భాస్కర్
Biksham
సూర్యాపేట పట్టణం 25వ వార్డు కౌన్సిలర్ కోడి శిరీష శివ నివాసంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాంత ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, పిసిసి ఎస్సి విభాగ ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి చింతమల్ల రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, కొనతం రాజేష్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం అధ్యక్షుడు బానోతు వెంకటి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గుణగంటి సతీష్, పాలగాని కృష్ణ, మద్దెబోయిన శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు చెరుకు రాము, నాగేల్లి అరుణ్ కుమార్, చెంచల నిఖిల్, చెరుకు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి