Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 10:14 PM

రెండు ఏళ్లుగా శుభ్రం కాని వాటర్ ట్యాంక్

రెండు ఏళ్లుగా శుభ్రం కాని వాటర్ ట్యాంక్

రెండు ఏళ్లుగా శుభ్రం కాని వాటర్ ట్యాంక్
February 10, 2026 07:33 AM 272 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

తాడు సహాయంతో ఎక్కి శుభ్రం చేసిన పంచాయతీ సిబ్బంది

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నాల గ్రామంలో తాగునీటి వాటర్ ట్యాంక్ నిర్వహణలో జరిగిన తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా ట్యాంక్‌ను శుభ్రం చేయకపోవడంతో లోపల భారీగా ఇసుక, మట్టి పేరుకుపోయినట్లు తేలింది.మెట్లు వంటి భద్రతా సౌకర్యాలు లేకపోయినా గ్రామపంచాయతీ సిబ్బంది నోముల శంకరయ్య ఒక తాడు సహాయంతో ట్యాంక్‌పైకి ఎక్కి శుభ్రపరిచే పనులు చేపట్టారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన ఈ చర్య పంచాయతీ నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లుగా గ్రామంలో చర్చకు దారితీసింది.తాగునీటి ట్యాంక్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాల్సిన బాధ్యత ఉన్నా, రెండేళ్లుగా పట్టించుకోకపోవడం ప్రజారోగ్యంపై ముప్పుగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తాగునీటి సరఫరా వ్యవస్థపై అధికారులు దృష్టి సారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News