Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:33 AM

రెండు ఏళ్లుగా శుభ్రం కాని వాటర్ ట్యాంక్

రెండు ఏళ్లుగా శుభ్రం కాని వాటర్ ట్యాంక్

రెండు ఏళ్లుగా శుభ్రం కాని వాటర్ ట్యాంక్
February 10, 2026 07:33 AM 293 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తాడు సహాయంతో ఎక్కి శుభ్రం చేసిన పంచాయతీ సిబ్బంది

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నాల గ్రామంలో తాగునీటి వాటర్ ట్యాంక్ నిర్వహణలో జరిగిన తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా ట్యాంక్‌ను శుభ్రం చేయకపోవడంతో లోపల భారీగా ఇసుక, మట్టి పేరుకుపోయినట్లు తేలింది.మెట్లు వంటి భద్రతా సౌకర్యాలు లేకపోయినా గ్రామపంచాయతీ సిబ్బంది నోముల శంకరయ్య ఒక తాడు సహాయంతో ట్యాంక్‌పైకి ఎక్కి శుభ్రపరిచే పనులు చేపట్టారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన ఈ చర్య పంచాయతీ నిర్లక్ష్యానికి అద్దం పట్టినట్లుగా గ్రామంలో చర్చకు దారితీసింది.తాగునీటి ట్యాంక్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాల్సిన బాధ్యత ఉన్నా, రెండేళ్లుగా పట్టించుకోకపోవడం ప్రజారోగ్యంపై ముప్పుగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తాగునీటి సరఫరా వ్యవస్థపై అధికారులు దృష్టి సారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News