Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 08:07 PM

రెండు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు దిశగా అడుగులు

రెండు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు దిశగా అడుగులు

రెండు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు దిశగా అడుగులు
February 23, 2026 06:30 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి ప్రధాన వంతెనలపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవ

ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబుతో భేటీ – నిధుల కేటాయింపుపై హామీ

చింతలపూడి నియోజకవర్గ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ప్రధాన వంతెనల నిర్మాణానికి మళ్లీ కదలిక కనిపిస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్న ఎమ్మెల్యే సోమవారం సచివాలయంలో ఆర్ అండ్ బి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ను కలిసి కీలక వినతిపత్రం సమర్పించారు.

గత రెండు దశాబ్దాలుగా ఫైళ్లలోనే నిలిచిపోయిన పలు వంతెనల నిర్మాణం లేక ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. రవాణా అంతరాయం వల్ల విద్యార్థులు, రైతులు, వ్యాపారులు నష్టపోతున్న పరిస్థితిని ఆయన ప్రస్తావించారు.

ప్రాధాన్యంగా ప్రతిపాదించిన వంతెనలు

  1. జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం–నర్సన్నపాలెం వై జంక్షన్ రహదారిపై బైనేరు వంతెన
  2. శ్రీనివాసపురం–పందిరి మామిడిగూడెం మధ్య పట్టణపాలెం వంతెన
  3. కామవరపుకోట–లింగపాలెం మండలాలను అనుసంధానించే గుండేరు వంతెన

ఈ వంతెనలు నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతాల మధ్య అనుసంధానం మెరుగుపడి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభమవుతుందని, అత్యవసర సేవలు వేగవంతమవుతాయని అభిప్రాయపడుతున్నారు.

వినతిని స్వీకరించిన ఎం.టి. కృష్ణబాబు సమస్యలపై సానుకూలంగా స్పందించి, సాంకేతిక పరిశీలన అనంతరం తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఈ భేటీ ఎంతవరకు ఫలితాన్నిస్తుందో చూడాలి. అయితే, ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లకు పాలక వర్గం స్పందించాల్సిన అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News