Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:52 AM

రెండు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు దిశగా అడుగులు

రెండు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు దిశగా అడుగులు

రెండు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు దిశగా అడుగులు
February 23, 2026 06:30 PM 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి ప్రధాన వంతెనలపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవ

ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబుతో భేటీ – నిధుల కేటాయింపుపై హామీ

చింతలపూడి నియోజకవర్గ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ప్రధాన వంతెనల నిర్మాణానికి మళ్లీ కదలిక కనిపిస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్న ఎమ్మెల్యే సోమవారం సచివాలయంలో ఆర్ అండ్ బి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ను కలిసి కీలక వినతిపత్రం సమర్పించారు.

గత రెండు దశాబ్దాలుగా ఫైళ్లలోనే నిలిచిపోయిన పలు వంతెనల నిర్మాణం లేక ప్రజలు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. రవాణా అంతరాయం వల్ల విద్యార్థులు, రైతులు, వ్యాపారులు నష్టపోతున్న పరిస్థితిని ఆయన ప్రస్తావించారు.

ప్రాధాన్యంగా ప్రతిపాదించిన వంతెనలు

  1. జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం–నర్సన్నపాలెం వై జంక్షన్ రహదారిపై బైనేరు వంతెన
  2. శ్రీనివాసపురం–పందిరి మామిడిగూడెం మధ్య పట్టణపాలెం వంతెన
  3. కామవరపుకోట–లింగపాలెం మండలాలను అనుసంధానించే గుండేరు వంతెన

ఈ వంతెనలు నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతాల మధ్య అనుసంధానం మెరుగుపడి, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభమవుతుందని, అత్యవసర సేవలు వేగవంతమవుతాయని అభిప్రాయపడుతున్నారు.

వినతిని స్వీకరించిన ఎం.టి. కృష్ణబాబు సమస్యలపై సానుకూలంగా స్పందించి, సాంకేతిక పరిశీలన అనంతరం తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఈ భేటీ ఎంతవరకు ఫలితాన్నిస్తుందో చూడాలి. అయితే, ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లకు పాలక వర్గం స్పందించాల్సిన అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News