రెండోసారి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ)
రెండోసారి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ)
Sthanikam District Staff Reporter
జిల్లా చైర్మన్గా సుదగాని మల్లేష్ గౌడ్ ఏకగ్రీవం
మోటకొండూరు:నిర్మాణ రంగంలో విశేష సేవలందిస్తున్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) యాదాద్రి జిల్లా సెంటర్ చైర్మన్ గా సుదగాని మల్లేష్ గౌడ్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యాదాద్రిలో జరిగిన వార్షిక సాధారణ మహాసభ ( ఎజిఎం ) లో ఎలక్షన్ అబ్సర్వర్లు రామకృష్ణ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డిల పర్యవేక్షణలో ఈ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మల్లేష్ గౌడ్ నాయకత్వంపై నమ్మకంతో సభ్యులందరూ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకం ఉంచి రెండోసారి బాధ్యతలు అప్పగించిన సభ్యులకు మరియు ఎన్నికల అధికారులకు మల్లేష్ గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వార్షిక సమావేశానికి విచ్చేసిన సభ్యుల గౌరవార్థం చైర్మన్ మల్లేష్ గౌడ్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. సభ్యులందరూ కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివెరా హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. రెండోసారి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) జిల్లా చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సుదగాని మల్లేష్ గౌడ్ కు బిల్డర్ సభ్యులు, మిత్రులు, చందేపల్లి గ్రామ పెద్దలు, యువకులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి