Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:49 PM

రెండోసారి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ)

రెండోసారి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ)

రెండోసారి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ)
January 31, 2026 08:03 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లా చైర్మన్‌గా సుదగాని మల్లేష్ గౌడ్ ఏకగ్రీవం

మోటకొండూరు:నిర్మాణ రంగంలో విశేష సేవలందిస్తున్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) యాదాద్రి జిల్లా సెంటర్ చైర్మన్‌ గా సుదగాని మల్లేష్ గౌడ్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యాదాద్రిలో జరిగిన వార్షిక సాధారణ మహాసభ ( ఎజిఎం ) లో ఎలక్షన్ అబ్సర్వర్లు రామకృష్ణ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డిల పర్యవేక్షణలో ఈ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మల్లేష్ గౌడ్ నాయకత్వంపై నమ్మకంతో సభ్యులందరూ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకం ఉంచి రెండోసారి బాధ్యతలు అప్పగించిన సభ్యులకు మరియు ఎన్నికల అధికారులకు మల్లేష్ గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వార్షిక సమావేశానికి విచ్చేసిన సభ్యుల గౌరవార్థం చైర్మన్ మల్లేష్ గౌడ్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. సభ్యులందరూ కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివెరా హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. రెండోసారి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) జిల్లా చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సుదగాని మల్లేష్ గౌడ్ కు బిల్డర్ సభ్యులు, మిత్రులు, చందేపల్లి గ్రామ పెద్దలు, యువకులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News