Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:29 AM

రెండోసారి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ)

రెండోసారి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ)

రెండోసారి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ)
31-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లా చైర్మన్‌గా సుదగాని మల్లేష్ గౌడ్ ఏకగ్రీవం

మోటకొండూరు:నిర్మాణ రంగంలో విశేష సేవలందిస్తున్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) యాదాద్రి జిల్లా సెంటర్ చైర్మన్‌ గా సుదగాని మల్లేష్ గౌడ్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యాదాద్రిలో జరిగిన వార్షిక సాధారణ మహాసభ ( ఎజిఎం ) లో ఎలక్షన్ అబ్సర్వర్లు రామకృష్ణ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డిల పర్యవేక్షణలో ఈ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మల్లేష్ గౌడ్ నాయకత్వంపై నమ్మకంతో సభ్యులందరూ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకం ఉంచి రెండోసారి బాధ్యతలు అప్పగించిన సభ్యులకు మరియు ఎన్నికల అధికారులకు మల్లేష్ గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వార్షిక సమావేశానికి విచ్చేసిన సభ్యుల గౌరవార్థం చైర్మన్ మల్లేష్ గౌడ్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. సభ్యులందరూ కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివెరా హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. రెండోసారి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) జిల్లా చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సుదగాని మల్లేష్ గౌడ్ కు బిల్డర్ సభ్యులు, మిత్రులు, చందేపల్లి గ్రామ పెద్దలు, యువకులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.

Sthanikam

రెండోసారి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ)

Article Image

జిల్లా చైర్మన్‌గా సుదగాని మల్లేష్ గౌడ్ ఏకగ్రీవం

మోటకొండూరు:నిర్మాణ రంగంలో విశేష సేవలందిస్తున్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) యాదాద్రి జిల్లా సెంటర్ చైర్మన్‌ గా సుదగాని మల్లేష్ గౌడ్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యాదాద్రిలో జరిగిన వార్షిక సాధారణ మహాసభ ( ఎజిఎం ) లో ఎలక్షన్ అబ్సర్వర్లు రామకృష్ణ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డిల పర్యవేక్షణలో ఈ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మల్లేష్ గౌడ్ నాయకత్వంపై నమ్మకంతో సభ్యులందరూ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకం ఉంచి రెండోసారి బాధ్యతలు అప్పగించిన సభ్యులకు మరియు ఎన్నికల అధికారులకు మల్లేష్ గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వార్షిక సమావేశానికి విచ్చేసిన సభ్యుల గౌరవార్థం చైర్మన్ మల్లేష్ గౌడ్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. సభ్యులందరూ కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివెరా హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. రెండోసారి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) జిల్లా చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సుదగాని మల్లేష్ గౌడ్ కు బిల్డర్ సభ్యులు, మిత్రులు, చందేపల్లి గ్రామ పెద్దలు, యువకులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News