రెండో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె
రెండో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె
K.RAVI
స్తంభించిన విద్యుత్ సేవలు.. అంధకారంలో గ్రామాలు
యాజమాన్యం మొండివైఖరిపై టి వి ఏ ఈ జె ఏ సి ఆగ్రహం
తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు విధులను బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. కార్మికులు రెండో రోజు కూడా సమ్మెలో కొనసాగుతున్నప్పటికీ, విద్యుత్ యాజమాన్యం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంపై కార్మిక సంఘం నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.అస్తవ్యస్తంగా విద్యుత్ వ్యవస్థఆర్టిజన్ కార్మికులు సమ్మెలో ఉండటంతో క్షేత్రస్థాయిలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఎక్కడైనా లైన్లలో సాంకేతిక లోపాలు తలెత్తినా, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు చేయాలన్నా చూసేవారు లేక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్వహణ పనులు పూర్తిగా నిలిచిపోవడంతో సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మా జీవితాల్లోనూ వెలుగులు నింపండి!ఈ సందర్భంగా టి వి ఏ ఈ జె ఏ సి నాయకులు మాట్లాడుతూ.. "ప్రజల ఇళ్లలో వెలుగులు నింపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఆర్టిజన్ల జీవితాల్లో మాత్రం చీకట్లు అలముకున్నాయి. మా సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణం" అని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తక్షణమే స్పందించి చర్చలు జరపాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.వినియోగదారుల ఆందోళన మరోవైపు, విద్యుత్ సేవలు నిలిచిపోవడంతో సామాన్య ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి కార్మికులతో చర్చలు జరిపి, సమ్మెను విరమింపజేయాలని వారు కోరుతున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి