రెండవ రోజు కొనసాగిన త్రాగునీటి కార్మికుల ధర్నా
రెండవ రోజు కొనసాగిన త్రాగునీటి కార్మికుల ధర్నా
Anjali
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో సత్యసాయి తాగునీటి కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం రెండవ రోజుకు చేరుకుంది. ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు తమ విధులను బహిష్కరించి, కొత్తచెరువు పంప్ హౌస్ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. ఈ సమ్మెకు ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఈఎస్ వెంకటేష్ మద్దతు తెలిపారు. బుధవారం కార్మికులతో కలిసి ఆయన దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఈఎస్ వెంకటేష్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి కార్మికుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలు రాత్రి తేడా లేకుండా పనిచేసే కార్మికులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కుటుంబాలను పోషించుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. అలాగే గత ఏడాది బడ్జెట్లో సత్యసాయి నీటి పథకానికి కేటాయించిన 36 కోట్లలో కేవలం 13 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం, ఈ ఏడాది బడ్జెట్లో మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి